సినిమాలకు బజ్ ఉండటం సహజం కానీ ఒక ఓటిటి టాక్ షో కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం అరుదు. దాన్ని ఆన్ స్టాపబుల్ చేసి చూపించింది. బాలకృష్ణ మొదటిసారి సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయి మొదలుపెట్టిన ఈ ట్రెండీ ఇంటర్వ్యూ పర్వం మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో భాగంలోకి అడుగు పెట్టింది. లాంచ్ ఎపిసోడ్ ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని గెస్టుగా తీసుకురావడంతో అంచనాలు పెరిగాయి. అందుకే ఈ బావా బావమరిది కాంబినేషన్ రెండోసారి అయినప్పటికీ రాజకీయ సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని తీసుకొచ్చింది.
ఇక హైలైట్స్ విషయానికి వస్తే బొబ్బిలి సింహం కాస్ట్యూమ్ లో విజయరాఘవ భూపతిగా బాలకృష్ణ మరోసారి ఆ సినిమాలోని పవర్ ఫుల్ ఎపిసోడ్ ని రీ క్రియేట్ చేయడం బాగా పేలింది. చంద్రబాబుని పరిచయం చేశాక ఇద్దరి మధ్య ఆత్మీయ ఆలింగనం, బాలయ్య అన్స్టాపబుల్ ఓత్ పేరుతో పుస్తకం మీద ప్రమాణస్వీకారం చేయించడం సరదాగా జరిగాయి. ముచ్చట్లలో భాగంగా చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కలిగిన మానసిక స్థితి, కుటుంబంతో పాటు జనంలో కలిగిన ఆవేదన, విషమ పరిస్థితుల్లో కారాగారానికి వచ్చి పవన్ కళ్యాణ్ తెలిపిన మద్దతు ఇవన్నీ ప్రస్తావనకు వచ్చి వివరంగా పంచుకున్నారు.
కొన్ని సరదా కబుర్లు దొర్లాయి. రొమాంటిక్ లేదా కామెడీ సినిమాల్లో ఏదంటే ఇష్టమని బాబుగారిని ఆగడటం, భువనేశ్వరి – బ్రాహ్మణి మధ్య పోలిక, వీడియో ద్వారా దేవాన్ష్ ప్రశ్నలు, 500 రూపాయలతో సూపర్ మార్కెట్ షాపింగ్ ఎలా చేస్తారని దాన్ని రియలిస్టిక్ గా చూపించడం ఇవన్నీ ఫన్ మోడ్ లో నడిపించారు. 1 గంట 15 నిమిషాల నిడివిలో పలు వీడియోలు, విజువల్స్ ని ప్రదర్శింపజేయడమే కాక వచ్చిన ఫ్యాన్స్ నుంచి కొందరికి చంద్రబాబుతో ప్రశ్నల రూపంలో సంభాషించే అవకాశం కలిగించారు, భావోద్వేగాలు, సరదాలు, రాజకీయ ప్రణాళికలు అన్నీ సమపాళ్ళలో సమకూరిన అన్స్టాపబుల్ 4 తొలి అడుగు ఘనంగానే పడింది.
This post was last modified on October 26, 2024 7:39 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…