సినిమాలకు బజ్ ఉండటం సహజం కానీ ఒక ఓటిటి టాక్ షో కోసం ప్రేక్షకులు ఎదురు చూడటం అరుదు. దాన్ని ఆన్ స్టాపబుల్ చేసి చూపించింది. బాలకృష్ణ మొదటిసారి సెలబ్రిటీ యాంకర్ గా మారిపోయి మొదలుపెట్టిన ఈ ట్రెండీ ఇంటర్వ్యూ పర్వం మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో భాగంలోకి అడుగు పెట్టింది. లాంచ్ ఎపిసోడ్ ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని గెస్టుగా తీసుకురావడంతో అంచనాలు పెరిగాయి. అందుకే ఈ బావా బావమరిది కాంబినేషన్ రెండోసారి అయినప్పటికీ రాజకీయ సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని తీసుకొచ్చింది.
ఇక హైలైట్స్ విషయానికి వస్తే బొబ్బిలి సింహం కాస్ట్యూమ్ లో విజయరాఘవ భూపతిగా బాలకృష్ణ మరోసారి ఆ సినిమాలోని పవర్ ఫుల్ ఎపిసోడ్ ని రీ క్రియేట్ చేయడం బాగా పేలింది. చంద్రబాబుని పరిచయం చేశాక ఇద్దరి మధ్య ఆత్మీయ ఆలింగనం, బాలయ్య అన్స్టాపబుల్ ఓత్ పేరుతో పుస్తకం మీద ప్రమాణస్వీకారం చేయించడం సరదాగా జరిగాయి. ముచ్చట్లలో భాగంగా చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కలిగిన మానసిక స్థితి, కుటుంబంతో పాటు జనంలో కలిగిన ఆవేదన, విషమ పరిస్థితుల్లో కారాగారానికి వచ్చి పవన్ కళ్యాణ్ తెలిపిన మద్దతు ఇవన్నీ ప్రస్తావనకు వచ్చి వివరంగా పంచుకున్నారు.
కొన్ని సరదా కబుర్లు దొర్లాయి. రొమాంటిక్ లేదా కామెడీ సినిమాల్లో ఏదంటే ఇష్టమని బాబుగారిని ఆగడటం, భువనేశ్వరి – బ్రాహ్మణి మధ్య పోలిక, వీడియో ద్వారా దేవాన్ష్ ప్రశ్నలు, 500 రూపాయలతో సూపర్ మార్కెట్ షాపింగ్ ఎలా చేస్తారని దాన్ని రియలిస్టిక్ గా చూపించడం ఇవన్నీ ఫన్ మోడ్ లో నడిపించారు. 1 గంట 15 నిమిషాల నిడివిలో పలు వీడియోలు, విజువల్స్ ని ప్రదర్శింపజేయడమే కాక వచ్చిన ఫ్యాన్స్ నుంచి కొందరికి చంద్రబాబుతో ప్రశ్నల రూపంలో సంభాషించే అవకాశం కలిగించారు, భావోద్వేగాలు, సరదాలు, రాజకీయ ప్రణాళికలు అన్నీ సమపాళ్ళలో సమకూరిన అన్స్టాపబుల్ 4 తొలి అడుగు ఘనంగానే పడింది.
This post was last modified on October 26, 2024 7:39 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…