Political News

విజ‌య‌న‌గ‌రంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌.. రాజ‌కీయ దుమారం?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయ‌న సోమ‌వారం విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే.. ఇది తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ.. బొత్స స‌త్య‌నారాయ‌ణ.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. సోమ‌వారం వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ధ‌ర్నాకు పిలుపునిచ్చిన‌ట్టు తెలిపారు. మ‌రి దీనికి కార‌ణాలేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల గ్రామంలో గ‌త వారం రోజులుగా డ‌యేరియా ప్ర‌బ‌లింది. ఈ క్ర‌మంలో వందల మంది ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల పాల‌య్యారు. 16 మంది వ్య‌క్తులు మృతి చెందారు. ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించ‌లేద‌న్న‌ది విప‌క్షం వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌. ఇదే విష‌యాన్ని శ‌నివారం పార్టీ నాయ‌కుల స‌మావేశంలో మాజీ సీఎం జ‌గ‌న్ కూడా చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం మ‌ద్యం, ఇసుక‌లో కూరుకుపోయిందని.. ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ట్టించుకోవడం లేద‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నేతృత్వంలో వైసీపీ బృందాన్ని గుర్ల గ్రామానికి పంపుతున్న‌ట్టు చెప్పారు. ఇదిలావుంటే.. సోమ‌వారం ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు రంగం రెడీ అయింది. ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో ఆయ‌న‌ సమీక్షిస్తారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నేత బొత్స త‌ప్పుప‌డుతున్నారు. 16 మంది చ‌నిపోయిన త‌ర్వాత‌.. గుర్ల గ్రామ ప‌రిస్థితి కూట‌మి స‌ర్కారుకు తెలిసిందా? అని నిల‌దీశారు.

అంతేకాదు.. డ‌యేరియా మ‌ర‌ణాలు స‌హ‌జ మ‌ర‌ణాలు కావ‌ని.. కూట‌మి ప్రభుత్వ అలసత్వం వల్ల సంభవించిన మరణాలని బొత్స‌ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్ అక్క‌డ‌కు వెళ్లేప్పుడు.. ప‌రిహారంతోనే అడుగు పెట్టాల‌ని.. చేతులు దులుపుకొని వ‌స్తానంటే కుద‌ర‌ద‌ని చెప్పారు. త‌మ నాయ‌కులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి దీనిపై స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on October 21, 2024 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

20 minutes ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

24 minutes ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

35 minutes ago

ఒక రోజుకే ప్రేక్షకులు మర్చిపోయారు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…

53 minutes ago

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

1 hour ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

2 hours ago