Political News

విజ‌య‌న‌గ‌రంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌.. రాజ‌కీయ దుమారం?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయ‌న సోమ‌వారం విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే.. ఇది తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ.. బొత్స స‌త్య‌నారాయ‌ణ.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. సోమ‌వారం వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ధ‌ర్నాకు పిలుపునిచ్చిన‌ట్టు తెలిపారు. మ‌రి దీనికి కార‌ణాలేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల గ్రామంలో గ‌త వారం రోజులుగా డ‌యేరియా ప్ర‌బ‌లింది. ఈ క్ర‌మంలో వందల మంది ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల పాల‌య్యారు. 16 మంది వ్య‌క్తులు మృతి చెందారు. ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించ‌లేద‌న్న‌ది విప‌క్షం వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌. ఇదే విష‌యాన్ని శ‌నివారం పార్టీ నాయ‌కుల స‌మావేశంలో మాజీ సీఎం జ‌గ‌న్ కూడా చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం మ‌ద్యం, ఇసుక‌లో కూరుకుపోయిందని.. ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ట్టించుకోవడం లేద‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నేతృత్వంలో వైసీపీ బృందాన్ని గుర్ల గ్రామానికి పంపుతున్న‌ట్టు చెప్పారు. ఇదిలావుంటే.. సోమ‌వారం ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు రంగం రెడీ అయింది. ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో ఆయ‌న‌ సమీక్షిస్తారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నేత బొత్స త‌ప్పుప‌డుతున్నారు. 16 మంది చ‌నిపోయిన త‌ర్వాత‌.. గుర్ల గ్రామ ప‌రిస్థితి కూట‌మి స‌ర్కారుకు తెలిసిందా? అని నిల‌దీశారు.

అంతేకాదు.. డ‌యేరియా మ‌ర‌ణాలు స‌హ‌జ మ‌ర‌ణాలు కావ‌ని.. కూట‌మి ప్రభుత్వ అలసత్వం వల్ల సంభవించిన మరణాలని బొత్స‌ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్ అక్క‌డ‌కు వెళ్లేప్పుడు.. ప‌రిహారంతోనే అడుగు పెట్టాల‌ని.. చేతులు దులుపుకొని వ‌స్తానంటే కుద‌ర‌ద‌ని చెప్పారు. త‌మ నాయ‌కులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి దీనిపై స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on October 21, 2024 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago