Political News

విజ‌య‌న‌గ‌రంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌.. రాజ‌కీయ దుమారం?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయ‌న సోమ‌వారం విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే.. ఇది తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ.. బొత్స స‌త్య‌నారాయ‌ణ.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. సోమ‌వారం వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ధ‌ర్నాకు పిలుపునిచ్చిన‌ట్టు తెలిపారు. మ‌రి దీనికి కార‌ణాలేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల గ్రామంలో గ‌త వారం రోజులుగా డ‌యేరియా ప్ర‌బ‌లింది. ఈ క్ర‌మంలో వందల మంది ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల పాల‌య్యారు. 16 మంది వ్య‌క్తులు మృతి చెందారు. ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించ‌లేద‌న్న‌ది విప‌క్షం వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌. ఇదే విష‌యాన్ని శ‌నివారం పార్టీ నాయ‌కుల స‌మావేశంలో మాజీ సీఎం జ‌గ‌న్ కూడా చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వం మ‌ద్యం, ఇసుక‌లో కూరుకుపోయిందని.. ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ట్టించుకోవడం లేద‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నేతృత్వంలో వైసీపీ బృందాన్ని గుర్ల గ్రామానికి పంపుతున్న‌ట్టు చెప్పారు. ఇదిలావుంటే.. సోమ‌వారం ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు రంగం రెడీ అయింది. ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో ఆయ‌న‌ సమీక్షిస్తారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నేత బొత్స త‌ప్పుప‌డుతున్నారు. 16 మంది చ‌నిపోయిన త‌ర్వాత‌.. గుర్ల గ్రామ ప‌రిస్థితి కూట‌మి స‌ర్కారుకు తెలిసిందా? అని నిల‌దీశారు.

అంతేకాదు.. డ‌యేరియా మ‌ర‌ణాలు స‌హ‌జ మ‌ర‌ణాలు కావ‌ని.. కూట‌మి ప్రభుత్వ అలసత్వం వల్ల సంభవించిన మరణాలని బొత్స‌ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్ అక్క‌డ‌కు వెళ్లేప్పుడు.. ప‌రిహారంతోనే అడుగు పెట్టాల‌ని.. చేతులు దులుపుకొని వ‌స్తానంటే కుద‌ర‌ద‌ని చెప్పారు. త‌మ నాయ‌కులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి దీనిపై స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on October 21, 2024 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారి గురుంచి ఆరా తీస్తున్న జ‌గ‌న్‌

వైసీపీ హ‌యాంలో ప‌దవులు ద‌క్కించుకున్న‌ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెల‌కు 3 ల‌క్ష‌ల‌కు పైగానే వేత‌నాల రూపంలో…

3 minutes ago

‘తమ్ముడు’కి ఎన్నెన్ని కష్టాలో…

నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…

15 minutes ago

ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…

43 minutes ago

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…

1 hour ago

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

2 hours ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

2 hours ago