ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన మార్పు చేశారు. గతంలో ఉన్నట్టుగానే వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికే ఇప్పుడు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. రెండేళ్లకుపైగానే సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్గా ఉన్నారు. ఈయన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగా యి. విశాఖపట్నంలో పార్టీ పాగా కూడా వేసింది.
అయితే.. ఎన్నికలకు ఏడాది ముందు అనూహ్య కారణాలతో సాయిరెడ్డిని తప్పించారు. ఈ క్రమంలోనే వైవీసుబ్బారెడ్డికి పగ్గాలు అప్పగించారు. కానీ, అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ధర్మాన ప్రసాదరావు వంటివారు వైవీతో విభేదించడం.. నువ్వు చెప్పేదేంటంటూ.. మొహం మీదే ప్రశ్నించడం తెలిసిందే. ఇలా.. మొత్తంగా వైవీ వల్ల ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడకపోగా.. మరింత ఇబ్బందులు ఎదుర్కొంది. మొత్తంగా భారీ ఎదురు దెబ్బ తగిలింది.
తాజాగా ఇప్పుడు పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాలుగు నెలలకు పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధ్యక్షులను మార్చిన పార్టీ అధినేత.. ఇప్పుడు కోఆర్టినేటర్లను మార్చారు. పార్టీలో తలపండిన సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇలా.. విజయసాయి రెడ్డికి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు.
అయితే.. ఈ బాధ్యతల్లోనూ కొంత మేరకు కోత పెట్టినట్టు తెలుస్తోంది. మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర లో సాయిరెడ్డికి కేవలం రెండు జిల్లాలు మాత్రమే అప్పగించారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు మాత్రమే విజయసాయిరెడ్డికి ఇచ్చారు. దీంతో విజయనగరం బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారనేది ఆసక్తిగా మారింది. ఇక, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వీరు ప్రతి నెలా రిపోర్టు ఇవ్వాలని.. పార్టీని గాడిలో పెట్టాలని జగన్ ఆదేశించడం గమనార్హం. మరి ఈ మార్పుతో వైసీపీ ఏమేరకు పుంజుకుంటుందనేది చూడాలి.
This post was last modified on October 18, 2024 12:43 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…