తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు కీలక సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృ ష్నారెడ్డి.. అందరు చెప్పినట్టే సమాధానాలు చెప్పారు. 2021, అక్టోబరు 19 నాడు జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తాజాగా మంగళగిరి స్టేషన్ సీఐ శ్రీనివాసరావు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు రావాలని పేర్కొన్నారు.
దీంతో సజ్జల మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్కు వచ్చారు. అది కూడా ఎవరికీ కనిపించకుండా అత్యంత రహస్యంగా స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు 38 ప్రశ్నలు సంధించినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో ప్రధానంగా అన్ని ప్రశ్నలకు సజ్జల దాటవేత ధోరణినే ప్రదర్శించినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. “ఏ ప్రశ్న అడిగినా.. ఏమో-తెలీదు-గుర్తులేదు అనే ఆయన సమాధానం ఇచ్చారు” అని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు చెప్పారు.
ఇక, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో ఇక నుంచి ఈ కేసును సీఐడీ పోలీసులే విచారిస్తారని.. సీఐ వివరించారు. తమకు అందిన సమాచారాన్ని సీఐడీ పోలీసులకు వెల్లడించను న్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో చాలా మంది నిందితులు కోర్టు నుంచి రక్షణ పొందారని.. దీంతో వారిని విచారించడం కష్టంగా ఉందన్నారు.
సజ్జలకు సంధించిన ప్రధాన ప్రశ్నల్లో కొన్ని..
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…