తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు కీలక సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృ ష్నారెడ్డి.. అందరు చెప్పినట్టే సమాధానాలు చెప్పారు. 2021, అక్టోబరు 19 నాడు జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తాజాగా మంగళగిరి స్టేషన్ సీఐ శ్రీనివాసరావు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు రావాలని పేర్కొన్నారు.
దీంతో సజ్జల మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్కు వచ్చారు. అది కూడా ఎవరికీ కనిపించకుండా అత్యంత రహస్యంగా స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు 38 ప్రశ్నలు సంధించినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో ప్రధానంగా అన్ని ప్రశ్నలకు సజ్జల దాటవేత ధోరణినే ప్రదర్శించినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. “ఏ ప్రశ్న అడిగినా.. ఏమో-తెలీదు-గుర్తులేదు అనే ఆయన సమాధానం ఇచ్చారు” అని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు చెప్పారు.
ఇక, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో ఇక నుంచి ఈ కేసును సీఐడీ పోలీసులే విచారిస్తారని.. సీఐ వివరించారు. తమకు అందిన సమాచారాన్ని సీఐడీ పోలీసులకు వెల్లడించను న్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో చాలా మంది నిందితులు కోర్టు నుంచి రక్షణ పొందారని.. దీంతో వారిని విచారించడం కష్టంగా ఉందన్నారు.
సజ్జలకు సంధించిన ప్రధాన ప్రశ్నల్లో కొన్ని..
This post was last modified on October 18, 2024 9:38 am
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…