తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు కీలక సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృ ష్నారెడ్డి.. అందరు చెప్పినట్టే సమాధానాలు చెప్పారు. 2021, అక్టోబరు 19 నాడు జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తాజాగా మంగళగిరి స్టేషన్ సీఐ శ్రీనివాసరావు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు రావాలని పేర్కొన్నారు.
దీంతో సజ్జల మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్కు వచ్చారు. అది కూడా ఎవరికీ కనిపించకుండా అత్యంత రహస్యంగా స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు 38 ప్రశ్నలు సంధించినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో ప్రధానంగా అన్ని ప్రశ్నలకు సజ్జల దాటవేత ధోరణినే ప్రదర్శించినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. “ఏ ప్రశ్న అడిగినా.. ఏమో-తెలీదు-గుర్తులేదు అనే ఆయన సమాధానం ఇచ్చారు” అని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు చెప్పారు.
ఇక, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో ఇక నుంచి ఈ కేసును సీఐడీ పోలీసులే విచారిస్తారని.. సీఐ వివరించారు. తమకు అందిన సమాచారాన్ని సీఐడీ పోలీసులకు వెల్లడించను న్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో చాలా మంది నిందితులు కోర్టు నుంచి రక్షణ పొందారని.. దీంతో వారిని విచారించడం కష్టంగా ఉందన్నారు.
సజ్జలకు సంధించిన ప్రధాన ప్రశ్నల్లో కొన్ని..
This post was last modified on October 18, 2024 9:38 am
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…