తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు కీలక సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృ ష్నారెడ్డి.. అందరు చెప్పినట్టే సమాధానాలు చెప్పారు. 2021, అక్టోబరు 19 నాడు జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తాజాగా మంగళగిరి స్టేషన్ సీఐ శ్రీనివాసరావు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు రావాలని పేర్కొన్నారు.
దీంతో సజ్జల మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్కు వచ్చారు. అది కూడా ఎవరికీ కనిపించకుండా అత్యంత రహస్యంగా స్టేషన్కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు 38 ప్రశ్నలు సంధించినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో ప్రధానంగా అన్ని ప్రశ్నలకు సజ్జల దాటవేత ధోరణినే ప్రదర్శించినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. “ఏ ప్రశ్న అడిగినా.. ఏమో-తెలీదు-గుర్తులేదు అనే ఆయన సమాధానం ఇచ్చారు” అని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు చెప్పారు.
ఇక, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో ఇక నుంచి ఈ కేసును సీఐడీ పోలీసులే విచారిస్తారని.. సీఐ వివరించారు. తమకు అందిన సమాచారాన్ని సీఐడీ పోలీసులకు వెల్లడించను న్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో చాలా మంది నిందితులు కోర్టు నుంచి రక్షణ పొందారని.. దీంతో వారిని విచారించడం కష్టంగా ఉందన్నారు.
సజ్జలకు సంధించిన ప్రధాన ప్రశ్నల్లో కొన్ని..
This post was last modified on October 18, 2024 9:38 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…