భూమా అఖిల ప్రియ. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్ల గడ్డ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న మాజీ మంత్రి. ఆమె విజయం దక్కించుకున్న ఈ నాలుగు మాసాల్లో రెండు సార్లు చంద్రబాబుకు పనికల్పించారు. ఈ రెండు సార్లు కూడా చంద్రబాబు ఆమెకు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక.. నియోజకవర్గంలో ఆమె అధికారులను బెదిరించిన వీడియోలు జూలైలో వెలుగు చూశాయి. తాను చెప్పింది వినాలని.. చెప్పిందే చేయాలని.. రూల్స్ ఉంటే మీ ఇంట్లో పాటించాలని ఆమె హెచ్చరించారు.
దీంతో చంద్రబాబు వరకు విషయం వెళ్లింది. స్పందించిన ఆయన ఆమెకు ఫోన్ చేసి క్లాసిచ్చారు. అంతేకాదు.. నీకు మంత్రి పదవి ఎందుకురాలేదో తెలుసుకోమని కూడా చురకలు అంటించారు. దీంతో ఒక నెల రోజులు సైలెంట్గా ఉన్న అఖిలప్రియారెడ్డి.. సెప్టెంబరులో మరోసారి నోరు జారారు. తన దగ్గర కూడా రెడ్ బుక్ ఉందని.. దానిలో 100 మందికిపైగా పేర్లు ఉన్నాయని.. వారందరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అంతేకాదు.. తాను మంచిదానని ఎవరూ అనుకోవద్దని కూడా అన్నారు.
ఈ వ్యాఖ్యలు కూడా సీఎం చంద్రబాబు వరకు చేరడం.. ఆ వెంటనే ఆయన మరోసారి కల్పించుకుని వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. దీంతో మళ్లీ నెల రోజులు మౌనంగా ఉన్న అఖిల ప్రియ తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో కయ్యానికి కాలు దువ్వారు. ఇటీవల ప్రకటించిన నామినేటేడ్ పదవుల్లో మోహన్రెడ్డికి చంద్రబాబు విజయ డెయిరీ చైర్మన్ పదవిని ఇచ్చారు. తాజాగా కర్నూలులోని డెయిరీ కార్యాలయానికి వెళ్లి భూమా.. ఆయన సీట్లోనే కూర్చున్నారు.
నిజానికి చైర్మన్ సీట్లో కూర్చుకోవడం ప్రధాన తప్పు. పైగా ఆయన లేనప్పుడు ఆఫీసులో కూర్చుని సమీక్షలు చేయడం ఇంకా తప్పు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మోహన్రెడ్డి స్పాట్లోనే ఫోన్ చేసి ప్రశ్నించారు. అయితే.. మోహన్రెడ్డిని దబాయించిన అఖిల ప్రియ.. “నాకు మామగా ఫోన్ చేసినావా?విజయా డైరీ ఛైర్మన్గా చేసినావా? మామ కుర్చీలో కోడలిగా నేను కూర్చుంటే తప్పా?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం.. వివాదానికి దారి తీసింది. దీంతో అఖిల ప్రియ ఆగట్లేదుగా! అనే కామెంట్లు టీడీపీలోనే వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 16, 2024 11:07 am
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…