టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెళ్లి కబురు ఏది అంటే ప్రభాస్దే అనడంలో మరో మాట లేదు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 ఏళ్లు కాగా.. దశాబ్దం కిందట్నుంచే తన పెళ్లి గురించి చర్చ జరుగుతోంది.
బాహుబలి టైంలోనే తన వివాహం గురించి జోరుగా చర్చ జరిగింది. ఆ సినిమా పూర్తి కాగానే ప్రభాస్కు పెళ్లి చేస్తామని కృష్ణంరాజు అన్నారు. కానీ ఆ మాట నిలబడలేదు. ‘బాహుబలి’ రెండు భాగాలు అయ్యాక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడే తప్ప పెళ్లి ఊసే ఎత్తలేదు ప్రభాస్. తన అన్న కొడుక్కి పెళ్లి చేయాలని ఎంతగానో కోరుకున్న కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు.
అంతకంటే ముందే ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు చర్చించుకోవడం మానేశారు. ఇక అతను వివాహం చేసుకోడేమోలే అని ఫిక్సయిపోయారు. కానీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం తన పెళ్లి విషయంలో అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు.
కొన్ని నెలల కిందట శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి జరుగుతుందని, అంతా పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. తాజాగా విజయవాడలోని కనక దుర్గమ్మ గుడికి వచ్చిన శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి త్వరలోనే తీపి కబురు చెప్పబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ వివాహం గురించి ప్రశ్నలు ఎదురు కావడం మామూలే. ఇక్కడా అదే జరిగింది. దానికామె బదులిస్తూ.. త్వరలోనే దీని గురించి ప్రకటన వస్తుందంటూ అభిమానులను ఊరించారు.
ఐతే మీడియా వాళ్లకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇలా పాజిటివ్గా మాట్లాడిందా.. లేక నిజంగానే ప్రభాస్ పెళ్లి ఫిక్సయిందా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి వార్త త్వరలోనే బయటికి వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్.. రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా అతను స్పిరిట్, సలార్-2, కల్కి-2 సినిమాలు చేయాల్సి ఉంది.
This post was last modified on October 15, 2024 4:45 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…