తమిళ సినిమాలను తమిళ టైటిళ్లతోనే తెలుగులో రిలీజ్ చేస్తుండడం మీద తాజాగా సామాజిక మాధ్యమాల్లో చర్చ ఊపందుకుంది. గతంలో ‘వలిమై’ సినిమాను అదే టైటిల్తో తెలుగులో రిలీజ్ చేశారు. ఆ మధ్య ‘జిగర్ తండ డబులెక్స్’ సినిమాను అదే పేరుతో విడుదల చేశారు. ఇటీవల ‘రాయన్’ మూవీ అదే టైటిల్తో తెలుగులోకి వచ్చింది.
లేటెస్ట్గా సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘వేట్టయాన్’ను కూడా అదే పేరుతో విడుదల చేస్తుండడం ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ పెట్టి దీని వెనుక కారణం వెల్లడించారు. ‘వేట్టయాన్’కు తెలుగులో ‘వేటగాడు’ అని పేరు పెడదామనుకున్నప్పటికీ.. ఆ టైటిల్ వేరే వాళ్ల దగ్గర ఉండడం, ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో వేరే ఆప్షన్ లేక తమిళ టైటిల్తోనే రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ‘గేమ్ చేంజర్’ టైటిల్ విషయంలో తాము పడ్డ ఇబ్బందిని కూడా నిర్మాత దిల్ రాజు బయటపెట్టారు. రామ్ చరణ్తో సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ పెడదామని శంకర్ ఫిక్స్ అయ్యాక అది పాన్ ఇండియా సినిమా కావడంతో కామన్గా ఇదే ఉండాలని భావించారని.. కానీ కొన్ని భాషల వరకు ఇబ్బంది లేకపోయినా.. ఒక లాంగ్వేజ్లో ఆ టైటిల్ దొరకలేదన్నారు.
ఆ పేరు మీద వేరే వాళ్లకు హక్కులు ఉండడంతో వాళ్లతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి టైటిల్ తీసుకోవడం చాలా ఇబ్బంది అయిందని దిల్ రాజు తెలిపాడు. పాన్ ఇండియా సినిమాలు తీసేటపుడు ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటోందని.. అందరికీ నప్పే కామన్ టైటిల్ పెట్టడంలో సమస్య తప్పట్లేదని దిల్ రాజు వివరించారు. ‘వేట్టయాన్’కు ఇదే సమస్య తలెత్తి.. తెలుగులో దీనికి సమానమైన టైటిల్ అందుబాటులో లేక ‘వేట్టయాన్’ అనే పేరుతోనే రిలీజ్ చేయాల్సి వస్తోందని రాజు తెలిపారు.
This post was last modified on October 10, 2024 11:13 am
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…