రాజరాజ చోర సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వచ్చిన స్వాగ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం కనిపిస్తోంది. ప్రీమియర్లు, మొదటి రోజు మార్నింగ్ షో చూసిన యూత్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపించినప్పటికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనేది ట్రేడ్ టాక్. వీకెండ్ మొత్తం కలిపి ఏడున్నర కోట్ల దాకా గ్రాస్ వచ్చిందనే వార్త పాజిటివ్ సైన్ కాదు. నిన్న మొదటి ఆదివారం బుక్ మై షోలో పాతిక వేల లోపే టికెట్లు అమ్ముడుపోవడం మరో ప్రమాద సంకేతం. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ నెంబర్ కనీసం నలభై వేలు దాటి ఉండాలనేది ఇటీవలి హిట్ సినిమాల ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
అసలు స్వాగ్ ఎదురీతకు కారణాలు ఏంటనేది ఓసారి లుక్ వేద్దాం. ట్రాన్స్ జెండర్ కాన్సెప్ట్ ని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని జొప్పించాలనే దర్శకుడు హసిత్ గోలి ప్రయత్నం ఒక వర్గం యూత్ కి కనెక్ట్ అయ్యింది కానీ సాధారణ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ కు గురి చేసింది. నిజానికి వాళ్ళు ఆశించింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. రెండున్నర గంటలు నవ్వుతూ బయటికి రావాలని. కానీ అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు. శ్రీవిష్ణు తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో నాలుగు పాత్రలను అవలీలగా పోషించినా స్క్రీన్ ప్లేలో ఉన్న సంక్లిష్టత వల్ల సామాన్య జనం నుంచి కోరుకున్న టాక్ బయటికి రాలేదు.
నిస్సందేహంగా స్వాగ్ ఆహ్వానించదగ్గ కంటెంటే కాని తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు కొంత మెరుగ్గా వర్క్ చేసి ఉంటే రాజరాజ చోరని మించేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించినప్పటికీ వైరలయ్యే స్థాయిలో పాటలు లేకపోవడం మరో మైనస్ గా నిలిచింది. స్వాగణిక వంశానికి ట్రాన్స్ జెండర్ సమస్యకు ముడిపెట్టే ఆలోచన బాగానే ఉన్నా అన్ని వర్గాలను మెప్పించడంలో తడబడింది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ కాస్త ఎక్కువే ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్. పది రోజుల క్రితం వచ్చిన దేవరనే స్వాగ్ కన్నా దూకుడుగా ఉండటం శ్రీవిష్ణుకి మాస్ మద్దతు మిస్సయిన వైనాన్ని స్పష్టం చేసింది.
This post was last modified on October 7, 2024 6:00 pm
మొత్తానికి ఒడుదొడుకులను దాటి ‘దేవర’ సినిమా సక్సెస్ అనిపించుకున్నట్లే కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు…
https://www.youtube.com/watch?v=RYBzWxQOnMM రుద్రమదేవి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీసి మంచి ఫలితాన్నే అందుకున్నాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. కానీ…
‘అందాల రాక్షసి’తో మొదలుపెట్టి నటుడిగా చాలానే సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారి తీసిన ‘చి ల సౌ’…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే.. అందులో మలయాళ చిత్రం ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాషా భేదం…
కొన్ని కొన్ని ఘటనలకు కార్యాకారణ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు.. అక్కడి తెలుగు దేశం పార్టీ పుంజుకోవడానికి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం 5 గంటల…