రాజరాజ చోర సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వచ్చిన స్వాగ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం కనిపిస్తోంది. ప్రీమియర్లు, మొదటి రోజు మార్నింగ్ షో చూసిన యూత్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపించినప్పటికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనేది ట్రేడ్ టాక్. వీకెండ్ మొత్తం కలిపి ఏడున్నర కోట్ల దాకా గ్రాస్ వచ్చిందనే వార్త పాజిటివ్ సైన్ కాదు. నిన్న మొదటి ఆదివారం బుక్ మై షోలో పాతిక వేల లోపే టికెట్లు అమ్ముడుపోవడం మరో ప్రమాద సంకేతం. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ నెంబర్ కనీసం నలభై వేలు దాటి ఉండాలనేది ఇటీవలి హిట్ సినిమాల ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
అసలు స్వాగ్ ఎదురీతకు కారణాలు ఏంటనేది ఓసారి లుక్ వేద్దాం. ట్రాన్స్ జెండర్ కాన్సెప్ట్ ని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని జొప్పించాలనే దర్శకుడు హసిత్ గోలి ప్రయత్నం ఒక వర్గం యూత్ కి కనెక్ట్ అయ్యింది కానీ సాధారణ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ కు గురి చేసింది. నిజానికి వాళ్ళు ఆశించింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. రెండున్నర గంటలు నవ్వుతూ బయటికి రావాలని. కానీ అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు. శ్రీవిష్ణు తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో నాలుగు పాత్రలను అవలీలగా పోషించినా స్క్రీన్ ప్లేలో ఉన్న సంక్లిష్టత వల్ల సామాన్య జనం నుంచి కోరుకున్న టాక్ బయటికి రాలేదు.
నిస్సందేహంగా స్వాగ్ ఆహ్వానించదగ్గ కంటెంటే కాని తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు కొంత మెరుగ్గా వర్క్ చేసి ఉంటే రాజరాజ చోరని మించేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించినప్పటికీ వైరలయ్యే స్థాయిలో పాటలు లేకపోవడం మరో మైనస్ గా నిలిచింది. స్వాగణిక వంశానికి ట్రాన్స్ జెండర్ సమస్యకు ముడిపెట్టే ఆలోచన బాగానే ఉన్నా అన్ని వర్గాలను మెప్పించడంలో తడబడింది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ కాస్త ఎక్కువే ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్. పది రోజుల క్రితం వచ్చిన దేవరనే స్వాగ్ కన్నా దూకుడుగా ఉండటం శ్రీవిష్ణుకి మాస్ మద్దతు మిస్సయిన వైనాన్ని స్పష్టం చేసింది.
This post was last modified on October 7, 2024 6:00 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…