రాజరాజ చోర సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వచ్చిన స్వాగ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం కనిపిస్తోంది. ప్రీమియర్లు, మొదటి రోజు మార్నింగ్ షో చూసిన యూత్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపించినప్పటికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనేది ట్రేడ్ టాక్. వీకెండ్ మొత్తం కలిపి ఏడున్నర కోట్ల దాకా గ్రాస్ వచ్చిందనే వార్త పాజిటివ్ సైన్ కాదు. నిన్న మొదటి ఆదివారం బుక్ మై షోలో పాతిక వేల లోపే టికెట్లు అమ్ముడుపోవడం మరో ప్రమాద సంకేతం. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ నెంబర్ కనీసం నలభై వేలు దాటి ఉండాలనేది ఇటీవలి హిట్ సినిమాల ట్రెండ్స్ సూచిస్తున్నాయి.
అసలు స్వాగ్ ఎదురీతకు కారణాలు ఏంటనేది ఓసారి లుక్ వేద్దాం. ట్రాన్స్ జెండర్ కాన్సెప్ట్ ని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని జొప్పించాలనే దర్శకుడు హసిత్ గోలి ప్రయత్నం ఒక వర్గం యూత్ కి కనెక్ట్ అయ్యింది కానీ సాధారణ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ కు గురి చేసింది. నిజానికి వాళ్ళు ఆశించింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. రెండున్నర గంటలు నవ్వుతూ బయటికి రావాలని. కానీ అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు. శ్రీవిష్ణు తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో నాలుగు పాత్రలను అవలీలగా పోషించినా స్క్రీన్ ప్లేలో ఉన్న సంక్లిష్టత వల్ల సామాన్య జనం నుంచి కోరుకున్న టాక్ బయటికి రాలేదు.
నిస్సందేహంగా స్వాగ్ ఆహ్వానించదగ్గ కంటెంటే కాని తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు కొంత మెరుగ్గా వర్క్ చేసి ఉంటే రాజరాజ చోరని మించేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించినప్పటికీ వైరలయ్యే స్థాయిలో పాటలు లేకపోవడం మరో మైనస్ గా నిలిచింది. స్వాగణిక వంశానికి ట్రాన్స్ జెండర్ సమస్యకు ముడిపెట్టే ఆలోచన బాగానే ఉన్నా అన్ని వర్గాలను మెప్పించడంలో తడబడింది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ కాస్త ఎక్కువే ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్. పది రోజుల క్రితం వచ్చిన దేవరనే స్వాగ్ కన్నా దూకుడుగా ఉండటం శ్రీవిష్ణుకి మాస్ మద్దతు మిస్సయిన వైనాన్ని స్పష్టం చేసింది.
This post was last modified on October 7, 2024 6:00 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…