మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ మధ్య విభిన్నంగా ఏదైనా చేద్దామని ఒప్పుకున్న సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడం ఏ స్థాయిలో ఉందంటే కనీసం అవొచ్చిన సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులకు తెలియనంత. దీని వల్ల వరుణ్ మార్కెట్ కి డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. అందుకే మట్కా నిర్మాణంలో ఉండగా ఏవేవో ప్రచారాలు, పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీటికి తోడు గత రెండు సినిమాలు ఫెయిల్యూర్స్ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ దీనికి డైరెక్టర్ కావడంతో వాటికి మరింత బలం చేకూరింది.
వీటికి చెక్ పెడుతూ నిన్న వచ్చిన మట్కా ట్రైలర్ అభిమానుల్లోనే కాదు ఆడియన్స్ లోనూ ఆసక్తి పెంచింది. 60 నుంచి 90 దశకం మధ్యలో సౌత్ ఇండియాని ఊపేసిన ఒక రియల్ లైఫ్ మట్కా డాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నవంబర్ 14 విడుదల కానుంది. యువకుడి నుంచి ముసలి వయసు దాకా వరుణ్ తేజ్ ని రకరకాల షేడ్స్ లో చూపించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మట్కా కోసం కరుణ కుమార్ కల్ట్ క్లాసిక్ నాయకుడు ఫార్ములాని వాడుకున్నాడు. అందులో వీరయ్య నాయుడు తరహాలో మట్కాలో వైజాగ్ వాసు ప్రయాణం చూపించబోతున్నారు.
ఫైనల్ గా వరుణ్ తేజ్ సరైన దారిలో పడ్డాడని చెప్పాలి. ప్యాన్ ఇండియాలో చేస్తున్నారు కాబట్టి కంటెంట్ కనక కనెక్ట్ అయితే సూపర్ హిట్ పడ్డట్టే. కాకపోతే దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కోతలో జరిగిన పొరపాట్లు మట్కాలో రిపీట్ కాకుంటే చాలు. ఈ సినిమా కోసం మెగా ప్రిన్స్ చాలా కష్టపడ్డాడు. లవ్, రొమాంటిక్ జానర్ నుంచి షిఫ్ట్ అయిపోయి మాస్, కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న వరుణ్ తేజ్ కి మట్కా సక్సెస్ కావడం చాలా కీలకం. దానికి తగ్గట్టే భారీ బడ్జెట్, పెద్ద టెక్నికల్ టీమ్, కోట్ల రూపాయల సెట్లు, జివి ప్రకాష్ సంగీతం అన్ని సమకూరాయి. ఇంకో నలభై రోజుల్లోపే థియేటర్లకు వచ్చేస్తోంది.
This post was last modified on October 6, 2024 3:30 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…