వనిత విజయ్ కుమార్.. ఈ నటి చేసిన సినిమాల కంటే.. ఆమె చుట్టూ నడిచిన వివాదాలే ఎక్కువ. దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయురాలైన వనిత.. ‘దేవి’ సహా కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.
అప్పుడు ఆమె పెద్దగా వార్తల్లో ఉండేది కాదు కానీ.. తల్లి మరణానంతరం తండ్రితో ఆస్తి గొడవలు.. అలాగే వ్యక్తిగత జీవితంలో వివాదాలతో తన పేరు మీడియాలో తరచుగా నానుతూనే ఉంది. తన వైవాహిక జీవితం ఎప్పుడూ వివాదాల మయమే.
ఆమెకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి జరగడం గమనార్హం. ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లి గురించి సమాచారం బయటికి వచ్చింది. అక్టోబరు 5న రాబర్ట్ అనే వ్యక్తితో తన పెళ్లి జరగబోతున్నట్లు వనిత స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్తో ఆమె కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది.
2000లో నటుడు ఆకాశ్ని పెళ్లి చేసుకోగా వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి పుట్టారు. ఐతే తర్వాత మనస్ఫర్తలు వచ్చి 2005లో ఈ జంట విడాకులు తీసుకు:ది. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తను వనిత రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు పుట్టింది.
ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆపై కొరియోగ్రాఫర్ రాబర్ట్తో కొన్నాళ్లపాటు వనిత సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ను వనిత మూడో పెళ్లి చేసుకుంది. కానీ నాలుగు నెలలకే వీరి మధ్య తీవ్రమైన గొడవలు వచ్చాయి. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మీడియాకెక్కారు.
ఐతే పీటర్తో తనకు పెళ్లే జరగలేదని వనిత ఆ సందర్భంలో చెప్పి అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుండగా ఇలా మాట్లాడడం వనితకే చెల్లింది. కాగా వనిత నుంచి విడిపోయాక అనారోగ్యంతో పీటర్ చనిపోయాడు. కొన్నాళ్ల పాటు మీడియా కంట్లో పడని వనిత.. ఇప్పుడు రాబర్ట్తో తన పెళ్లి వార్తతో మళ్లీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.
This post was last modified on October 2, 2024 10:49 am
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…