వనిత విజయ్ కుమార్.. ఈ నటి చేసిన సినిమాల కంటే.. ఆమె చుట్టూ నడిచిన వివాదాలే ఎక్కువ. దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయురాలైన వనిత.. ‘దేవి’ సహా కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.
అప్పుడు ఆమె పెద్దగా వార్తల్లో ఉండేది కాదు కానీ.. తల్లి మరణానంతరం తండ్రితో ఆస్తి గొడవలు.. అలాగే వ్యక్తిగత జీవితంలో వివాదాలతో తన పేరు మీడియాలో తరచుగా నానుతూనే ఉంది. తన వైవాహిక జీవితం ఎప్పుడూ వివాదాల మయమే.
ఆమెకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి జరగడం గమనార్హం. ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లి గురించి సమాచారం బయటికి వచ్చింది. అక్టోబరు 5న రాబర్ట్ అనే వ్యక్తితో తన పెళ్లి జరగబోతున్నట్లు వనిత స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్తో ఆమె కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది.
2000లో నటుడు ఆకాశ్ని పెళ్లి చేసుకోగా వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి పుట్టారు. ఐతే తర్వాత మనస్ఫర్తలు వచ్చి 2005లో ఈ జంట విడాకులు తీసుకు:ది. 2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తను వనిత రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు పుట్టింది.
ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆపై కొరియోగ్రాఫర్ రాబర్ట్తో కొన్నాళ్లపాటు వనిత సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్ను వనిత మూడో పెళ్లి చేసుకుంది. కానీ నాలుగు నెలలకే వీరి మధ్య తీవ్రమైన గొడవలు వచ్చాయి. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మీడియాకెక్కారు.
ఐతే పీటర్తో తనకు పెళ్లే జరగలేదని వనిత ఆ సందర్భంలో చెప్పి అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుండగా ఇలా మాట్లాడడం వనితకే చెల్లింది. కాగా వనిత నుంచి విడిపోయాక అనారోగ్యంతో పీటర్ చనిపోయాడు. కొన్నాళ్ల పాటు మీడియా కంట్లో పడని వనిత.. ఇప్పుడు రాబర్ట్తో తన పెళ్లి వార్తతో మళ్లీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…