Movie News

వరుణ్ తేజ్.. పెద్ద రిస్కే

టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్‌కు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. అతను లీడ్ రోల్ చేసిన చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్.. ఇలా గత రెండేళ్లలో మూడు వైవిధ్యమైన సినిమాలతో అతను ప్రేక్షకులను పలకరించాడు. కానీ ప్రతిసారీ తిరస్కారమే ఎదురైంది. దీంతో తన ఆశలన్నీ కొత్త చిత్రం ‘మట్కా’ మీదే ఉన్నాయి.

‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ‘హాయ్ నాన్న’ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్.. ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తాజాగా రిలీజ్ డేట్ ఖరారు చేశారు. నవంబరు 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ డేట్ చాలా రిస్కీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుక్కారణం.. కంగువ.

సూర్య ప్రధాన పాత్ర పోషించిన ‘కంగువ’ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. దీంతో మరో సోలో డేట్ కోసం చూసిన టీం నవంబరు 14కు ఫిక్స్ అయింది.

మామూలుగా నవంబరు నెల పెద్ద సినిమాలకు పెద్దగా కలిసి రాదు. కానీ ‘కంగువ’కు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆ డేట్‌‌తో ఇబ్బంది లేదనుకున్నారు. ‘కంగువ’ పట్ల తమిళం అనే కాక ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఆ మూవీ ఇప్పటికే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. అలాంటి సినిమాకు పోటీగా వరుణ్ మూవీని రిలీజ్ చేయడం ఎంత వరకు శ్రేయస్కరం అనే ప్రశ్న తలెత్తుతోంది. అసలే వరుణ్ ఫ్లాపుల మీద ఉన్నాడు. కరుణ్ కుమార్‌ మంచి అభిరుచి ఉన్న దర్శకుడే కానీ.. ఇప్పటిదాకా కమర్షియల్ సక్సెస్ లేదు. ‘మట్కా’ బడ్జెట్ ఏమో వరుణ్ మార్కెట్‌కు మించి పెట్టేశారు. పైగా దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాంటపుడు పెద్దగా కలిసి రాని సీజన్లో.. సూర్య క్రేజీ మూవీకి పోటీగా విడుదల చేయాలనుకోవడం రిస్క్ కాక మరేంటి?

This post was last modified on October 1, 2024 1:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: KanguvaMatka

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

44 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago