ఆ మధ్య కల్కి 2898 ఏడి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ సీనియర్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో అందరికీ గుర్తే. ప్రభాస్ ని జోకర్ తో పోలుస్తూ ఇచ్చిన నిర్వచనం అన్ని వర్గాల ఆగ్రహానికి కారణమయ్యింది. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా ముంబైలో ఉండే నటీనటుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. అయినా సరే అర్షద్ ని దీని గురించి అడుగుదామంటే మీడియాకు దొరక్కుండా మేనేజ్ చేసుకున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో జర్నలిస్టుల నుంచి ఆ ప్రశ్నను తప్పించుకోలేక వివరణ ఇచ్చాడు.
తాను అన్నది హీరోని కాదని, పాత్ర గురించి మాత్రమే విమర్శ చేశానని, ఒక యాక్టర్ గా ఎప్పుడో ఋజువు చేసుకుని గొప్ప సినిమాలు చేస్తున్న ప్రభాస్ గురించి తాను అన్న మాటలను వివాదం కోరుకునే కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చాడు. బ్రిలియంట్ యాక్టర్ గా ప్రతి సినిమాకు ఇంకో స్థాయికి వెళ్తున్న ప్రభాస్ మీద నోరెందుకు పారేసుకుంటానని అన్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ముచ్చటేదో కాంట్రావర్సి వచ్చినప్పుడే కనీసం ఒక వీడియో రూపంలోనే లేదా ట్వీట్ ద్వారానో చెప్పి ఉంటే సరిపోయేది. ఇన్ని వారాలు నానబెట్టి ఇప్పుడు తీరిగ్గా నేనన్నది తూచ్ అంటే ఎలా అనేది ఫ్యాన్స్ వెర్షన్.
ఏదైతేనేం మొత్తానికి అర్షద్ వార్సి ఈ వ్యవహారానికి చెక్ పెట్టేశాడు. అయినా ప్రభాస్ మీద ఇలాంటి శోకాలు, కామెంట్లు కొత్త కాదు, ఇప్పట్లో ఆగేవి కాదు. బాహుబలి నుంచి ఇది జరుగుతూనే ఉంది. కేవలం డబ్బింగ్ వెర్షన్లతో హిందీలో ఆల్ టైం రికార్డులు సృష్టించడం చూసి అక్కడి చాలా మంది ఖాన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి మాటల రూపంలో బాణాలు వదులుతూ తిరిగి బూమరాంగ్ కావడం అలవాటైపోయింది. ఇంత చేసిన అర్షద్ వార్సీ రేపు ఎప్పుడైనా ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే వద్దంటాడా. చిన్నదో పెద్దదో క్యారెక్టర్ ఏదైనా యెగిరి గంతేసి చేస్తాడు. డార్లింగ్ రేంజ్ అలాంటిది.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…