ఆ మధ్య కల్కి 2898 ఏడి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ సీనియర్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో అందరికీ గుర్తే. ప్రభాస్ ని జోకర్ తో పోలుస్తూ ఇచ్చిన నిర్వచనం అన్ని వర్గాల ఆగ్రహానికి కారణమయ్యింది. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా ముంబైలో ఉండే నటీనటుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. అయినా సరే అర్షద్ ని దీని గురించి అడుగుదామంటే మీడియాకు దొరక్కుండా మేనేజ్ చేసుకున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో జర్నలిస్టుల నుంచి ఆ ప్రశ్నను తప్పించుకోలేక వివరణ ఇచ్చాడు.
తాను అన్నది హీరోని కాదని, పాత్ర గురించి మాత్రమే విమర్శ చేశానని, ఒక యాక్టర్ గా ఎప్పుడో ఋజువు చేసుకుని గొప్ప సినిమాలు చేస్తున్న ప్రభాస్ గురించి తాను అన్న మాటలను వివాదం కోరుకునే కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చాడు. బ్రిలియంట్ యాక్టర్ గా ప్రతి సినిమాకు ఇంకో స్థాయికి వెళ్తున్న ప్రభాస్ మీద నోరెందుకు పారేసుకుంటానని అన్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ముచ్చటేదో కాంట్రావర్సి వచ్చినప్పుడే కనీసం ఒక వీడియో రూపంలోనే లేదా ట్వీట్ ద్వారానో చెప్పి ఉంటే సరిపోయేది. ఇన్ని వారాలు నానబెట్టి ఇప్పుడు తీరిగ్గా నేనన్నది తూచ్ అంటే ఎలా అనేది ఫ్యాన్స్ వెర్షన్.
ఏదైతేనేం మొత్తానికి అర్షద్ వార్సి ఈ వ్యవహారానికి చెక్ పెట్టేశాడు. అయినా ప్రభాస్ మీద ఇలాంటి శోకాలు, కామెంట్లు కొత్త కాదు, ఇప్పట్లో ఆగేవి కాదు. బాహుబలి నుంచి ఇది జరుగుతూనే ఉంది. కేవలం డబ్బింగ్ వెర్షన్లతో హిందీలో ఆల్ టైం రికార్డులు సృష్టించడం చూసి అక్కడి చాలా మంది ఖాన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి మాటల రూపంలో బాణాలు వదులుతూ తిరిగి బూమరాంగ్ కావడం అలవాటైపోయింది. ఇంత చేసిన అర్షద్ వార్సీ రేపు ఎప్పుడైనా ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే వద్దంటాడా. చిన్నదో పెద్దదో క్యారెక్టర్ ఏదైనా యెగిరి గంతేసి చేస్తాడు. డార్లింగ్ రేంజ్ అలాంటిది.
This post was last modified on September 29, 2024 1:09 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…