మాములుగా దర్శకధీర రాజమౌళితో ఎవరైనా హీరో సినిమా ఒప్పుకుంటే వాళ్ళు బయట కనిపించడం తగ్గిపోతుంది. ఆయన అనుమతి లేనిదే కనీసం ఇంకో షూటింగ్ లో పాల్గొనలేరు. ఆర్ఆర్ఆర్ టైంలో రామ్ చరణ్ ఆచార్య ప్రత్యేక క్యామియో చేయడానికి కొరటాల శివ, చిరంజీవి స్వయంగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక పబ్లిక్ ఈవెంట్ల సంగతి సరేసరి. కానీ మహేష్ బాబుకి మాత్రం అలాంటి కండీషన్లు పెట్టలేదు. ఆయన స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద విరాళం అందించే టైంలో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులకు మాములు గూస్ బంప్స్ రాలేదు.
ఎప్పుడూ లేనిది జక్కన్న మహేష్ కు మాత్రం ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చాడనే సందేహం రావడం సహజం. టీమ్ నుంచి వస్తున్న లీక్స్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులున్నాయి. బయట చూస్తున్నట్టు మహేష్ లుక్ ఇది కాదట. ముందు జులపాల జుట్టు, గుబురు గెడ్డం, మీసం పెంచాక ఫైనల్ గా తనకు కావాల్సిన లుక్ కోసం విదేశాల నుంచి హెయిర్ స్టయిలిస్టులను రాజమౌళి పిలిపించబోతున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న లుక్ తో ఒక ఫోటో షూట్ చేసి వాటి మీద ఫారిన్ ఎక్స్ పర్ట్స్ నాలుగైదు ఆప్షన్లతో వివిధ డిజైన్లు తయారు చేయించే పనిలో ఉన్నారట.
వాటిని విశ్లేషించుకుని ఒకటి బెస్ట్ అనిపించింది ఎంపిక చేసుకుని అప్పుడు మహేష్ ని ఆ గెటప్ లోకి తీసుకొస్తారు. అది జరిగాక బయట కనిపించడం తగ్గిపోతుంది. ఒకవేళ ఎమెర్జెన్సీ అయితే తల మీద టోపీ, మొహానికి మాస్కుతో కవర్ చేస్తారు. ఇదంతా జరగడానికి ఇంకో రెండు మూడు నెలలు టైం పట్టేలా ఉంది. అందుకే మహేష్ హ్యాపీగా తిరిగేస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అఫీషియల్ లాంచ్ ఎప్పుడు చేయాలనేది రాజమౌళి ఇంకా నిర్ణయించలేదట. అప్డేట్స్ కోసమైతే ఇప్పుడప్పుడే అభిమానులు ఎదురుచూడకపోవడం బెటర్.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…