అల్లు అర్జున్ – సుకుమార్ల పుష్ప చిత్రానికి ఇంకా విలన్ ఎవరనేది ఫిక్సవలేదు. మొదట విజయ్ సేతుపతి అనుకున్నారు కానీ లాక్డౌన్ టైమ్లో తనకు డేట్స్ కుదరవని అతను తప్పుకున్నాడు. దాంతో నారా రోహిత్ను సంప్రదించారు కానీ హీరోగా మరోసారి అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలలో వున్న అతను సమ్మతం తెలుపలేదు. ఆ తర్వాత తమిళ హీరో మాధవన్ ఇందులో విలన్గా నటిస్తున్నాడంటూ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.
దీనిపై పుష్ప యూనిట్ స్పందించే ముందే మాధవన్ స్పందించి ఫుల్స్టాప్ పెట్టేసాడు. సదరు న్యూస్ తాలూకు లింక్ ట్యాగ్ చేసి ‘ఇందులో కాస్త కూడా నిజం లేదు’ అని మాధవన్ పేర్కొన్నాడు. దీంతో పుష్ప విలన్ స్లాట్ ఇంకా ఓపెన్గానే వుంది. ఇంకా ఆ పార్ట్ ఎవరు చేయాలనేది డిసైడ్ కాలేదు కానీ పుష్పకు ముందు ఫైట్ సీన్లు తీయాలని సుకుమార్ డిసైడ్ చేసాడు.
కేరళలో నెల రోజుల పాటు రెండు భారీ ఫైట్, ఛేజ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నవంబరులో కేరళ వెళ్లి ఈ ఫైట్ సీన్లు ముగించుకుని ఆ తర్వాత టాకీ పార్ట్ ఎక్కడ తీస్తే బెస్ట్ అనేది డిసైడ్ అవుతారట. కేరళలో కన్వీనియంట్ అనిపిస్తే చాలా వరకు షూటింగ్ అక్కడే కానిచ్చేస్తారు. కాని పక్షంలో మారేడుమిల్లి ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…