అల్లు అర్జున్ – సుకుమార్ల పుష్ప చిత్రానికి ఇంకా విలన్ ఎవరనేది ఫిక్సవలేదు. మొదట విజయ్ సేతుపతి అనుకున్నారు కానీ లాక్డౌన్ టైమ్లో తనకు డేట్స్ కుదరవని అతను తప్పుకున్నాడు. దాంతో నారా రోహిత్ను సంప్రదించారు కానీ హీరోగా మరోసారి అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలలో వున్న అతను సమ్మతం తెలుపలేదు. ఆ తర్వాత తమిళ హీరో మాధవన్ ఇందులో విలన్గా నటిస్తున్నాడంటూ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.
దీనిపై పుష్ప యూనిట్ స్పందించే ముందే మాధవన్ స్పందించి ఫుల్స్టాప్ పెట్టేసాడు. సదరు న్యూస్ తాలూకు లింక్ ట్యాగ్ చేసి ‘ఇందులో కాస్త కూడా నిజం లేదు’ అని మాధవన్ పేర్కొన్నాడు. దీంతో పుష్ప విలన్ స్లాట్ ఇంకా ఓపెన్గానే వుంది. ఇంకా ఆ పార్ట్ ఎవరు చేయాలనేది డిసైడ్ కాలేదు కానీ పుష్పకు ముందు ఫైట్ సీన్లు తీయాలని సుకుమార్ డిసైడ్ చేసాడు.
కేరళలో నెల రోజుల పాటు రెండు భారీ ఫైట్, ఛేజ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నవంబరులో కేరళ వెళ్లి ఈ ఫైట్ సీన్లు ముగించుకుని ఆ తర్వాత టాకీ పార్ట్ ఎక్కడ తీస్తే బెస్ట్ అనేది డిసైడ్ అవుతారట. కేరళలో కన్వీనియంట్ అనిపిస్తే చాలా వరకు షూటింగ్ అక్కడే కానిచ్చేస్తారు. కాని పక్షంలో మారేడుమిల్లి ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు.
This post was last modified on September 30, 2020 1:24 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…