Movie News

పుష్పకి అతనూ నో చెప్పేసాడు!

అల్లు అర్జున్‍ – సుకుమార్‍ల పుష్ప చిత్రానికి ఇంకా విలన్‍ ఎవరనేది ఫిక్సవలేదు. మొదట విజయ్‍ సేతుపతి అనుకున్నారు కానీ లాక్‍డౌన్‍ టైమ్‍లో తనకు డేట్స్ కుదరవని అతను తప్పుకున్నాడు. దాంతో నారా రోహిత్‍ను సంప్రదించారు కానీ హీరోగా మరోసారి అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాలలో వున్న అతను సమ్మతం తెలుపలేదు. ఆ తర్వాత తమిళ హీరో మాధవన్‍ ఇందులో విలన్‍గా నటిస్తున్నాడంటూ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.

దీనిపై పుష్ప యూనిట్‍ స్పందించే ముందే మాధవన్‍ స్పందించి ఫుల్‍స్టాప్‍ పెట్టేసాడు. సదరు న్యూస్‍ తాలూకు లింక్‍ ట్యాగ్‍ చేసి ‘ఇందులో కాస్త కూడా నిజం లేదు’ అని మాధవన్‍ పేర్కొన్నాడు. దీంతో పుష్ప విలన్‍ స్లాట్‍ ఇంకా ఓపెన్‍గానే వుంది. ఇంకా ఆ పార్ట్ ఎవరు చేయాలనేది డిసైడ్‍ కాలేదు కానీ పుష్పకు ముందు ఫైట్‍ సీన్లు తీయాలని సుకుమార్‍ డిసైడ్‍ చేసాడు.

కేరళలో నెల రోజుల పాటు రెండు భారీ ఫైట్‍, ఛేజ్‍ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నవంబరులో కేరళ వెళ్లి ఈ ఫైట్‍ సీన్లు ముగించుకుని ఆ తర్వాత టాకీ పార్ట్ ఎక్కడ తీస్తే బెస్ట్ అనేది డిసైడ్‍ అవుతారట. కేరళలో కన్వీనియంట్‍ అనిపిస్తే చాలా వరకు షూటింగ్‍ అక్కడే కానిచ్చేస్తారు. కాని పక్షంలో మారేడుమిల్లి ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు.

This post was last modified on September 30, 2020 1:24 am

Share
Show comments
Published by
suman

Recent Posts

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

2 hours ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

4 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

5 hours ago

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…

5 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

6 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

7 hours ago