నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు. 15 నెలల వ్యవధిలో అతను మూడు సక్సెస్లు అందుకున్నాడు. గత ఏడాది వేసవిలో నాని మూవీ ‘దసరా’ మంచి విజయాన్నందుకుంది. ఇలాంటి మాస్ హిట్ తర్వాత ఆ ఏడాది చివర్లో ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతో హిట్ కొట్టాడు. ఇక ఇటీవలే ‘సరిపోదా శనివారం’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. వర్షాల వల్ల అక్కడక్కడా స్వల్ప నష్టాలు వచ్చాయి కానీ.. ఓవరాల్గా ఈ మూవీ పెట్టుబడిని వెనక్కి తెచ్చి సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.
ఈ ఉత్సాహంలో నేచురల్ స్టార్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇంతకముందే ఖరారైన ‘హిట్-3’ చిత్రాన్ని లైన్లోకి తీసుకొచ్చాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన శైలేష్ కొలన దర్శకత్వంలో ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ మొదలైంది.
ఐతే ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని.. శ్రీకాంత్ ఓదెల సినిమా చేస్తాడని ముందు అనుకున్నారు. ఆ సినిమానే ముందు అనౌన్స్ చేశారు కూడా. ఐతే స్క్రిప్టు రెడీ కావడంలో బాగా ఆలస్యం జరగడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ‘హిట్-3’ ముందుకు వచ్చేసింది. దీంతో ‘దసరా’ కాంబో రిపీటవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.
ఐతే తాజాగా నాని.. శ్రీకాంత్ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చేశాడు. ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లిన విషయాన్ని ధ్రువీకరించాడు. ‘దసరా’తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని నాని చెప్పడం విశేషం. నాని ఒకేసారి హిట్-3, శ్రీకాంత్ సినిమాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. మరి రెండు చిత్రాల మధ్య లుక్స్ పరంగా ఎలా వైవిధ్యం చూపిస్తాడో చూడాలి. ఇలా నిలకడగా హిట్లు ఇస్తూ.. వేగంగా సినిమాలు చేయగలగడం నానికే చెల్లు అని ఇండస్ట్రీలో అందరూ అతణ్ని ప్రశంసిస్తున్నారు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…