నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు. 15 నెలల వ్యవధిలో అతను మూడు సక్సెస్లు అందుకున్నాడు. గత ఏడాది వేసవిలో నాని మూవీ ‘దసరా’ మంచి విజయాన్నందుకుంది. ఇలాంటి మాస్ హిట్ తర్వాత ఆ ఏడాది చివర్లో ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతో హిట్ కొట్టాడు. ఇక ఇటీవలే ‘సరిపోదా శనివారం’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. వర్షాల వల్ల అక్కడక్కడా స్వల్ప నష్టాలు వచ్చాయి కానీ.. ఓవరాల్గా ఈ మూవీ పెట్టుబడిని వెనక్కి తెచ్చి సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.
ఈ ఉత్సాహంలో నేచురల్ స్టార్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇంతకముందే ఖరారైన ‘హిట్-3’ చిత్రాన్ని లైన్లోకి తీసుకొచ్చాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన శైలేష్ కొలన దర్శకత్వంలో ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ మొదలైంది.
ఐతే ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని.. శ్రీకాంత్ ఓదెల సినిమా చేస్తాడని ముందు అనుకున్నారు. ఆ సినిమానే ముందు అనౌన్స్ చేశారు కూడా. ఐతే స్క్రిప్టు రెడీ కావడంలో బాగా ఆలస్యం జరగడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ‘హిట్-3’ ముందుకు వచ్చేసింది. దీంతో ‘దసరా’ కాంబో రిపీటవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.
ఐతే తాజాగా నాని.. శ్రీకాంత్ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చేశాడు. ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లిన విషయాన్ని ధ్రువీకరించాడు. ‘దసరా’తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని నాని చెప్పడం విశేషం. నాని ఒకేసారి హిట్-3, శ్రీకాంత్ సినిమాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. మరి రెండు చిత్రాల మధ్య లుక్స్ పరంగా ఎలా వైవిధ్యం చూపిస్తాడో చూడాలి. ఇలా నిలకడగా హిట్లు ఇస్తూ.. వేగంగా సినిమాలు చేయగలగడం నానికే చెల్లు అని ఇండస్ట్రీలో అందరూ అతణ్ని ప్రశంసిస్తున్నారు.
This post was last modified on September 19, 2024 4:11 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…