దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న నటులున్నారు. వీరికి తోడు ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషించారు. కంటెంట్, మేకింగ్ అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో కనిపిస్తన్నాయి. పెద్ద బడ్జెట్లోనే సినిమా తీశారు. ఇలాంటి సినిమా విడుదలకు సిద్ధమైందంటే ప్రమోషన్లు గట్టిగా చేయడం సహజం. కానీ ‘నిశ్శబ్దం’ టీం మాత్రం టైటిల్కు తగ్గట్లే సైలెంటుగా ఉంటుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అయితే ఈ సినిమాను ఏ రేంజిలో ప్రమోట్ చేసేవారో అంచనా వేయొచ్చు. అనుష్క మీడియా ముందుకొచ్చి సందడి చేసేది. టీవీ ఛానెళ్లకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేదేమో. కోన వెంకట్, మాధవన్, దర్శకుడు మధుకర్ కూడా ప్రమోషన్లలో బిజీగా ఉండేవాళ్లు. ఐతే ‘నిశ్శబ్దం’ను అమేజాన్ ప్రైమ్ వాళ్లకు ఇచ్చేయడం వల్లో ఏమో.. ప్రమోషన్లలో అంతగా సందడి కనిపించట్లేదు. మధుకర్ యూట్యూబ్ ఛానెళ్లలో కొన్ని ఇంటర్వ్యూలిచ్చాడు. మాధవన్ కొన్ని మీడియా సంస్థలకు ఫోన్ ఇంటర్వ్యూలిచ్చాడు. ట్విట్టర్లో ట్రైలర్, టీజర్ రిలీజ్ చేశారు.
అంతే.. అంతకుమించి ప్రమోషన్ అన్నదే లేదు. మధుకర్, మాధవన్ ఇంటర్వ్యూలో ఏమంత సెన్సేషనల్గా లేవు. అనుష్క అయితే అడ్రస్ లేదు. ఆమె వర్చువల్గా అయినా మీడియాను మీట్ కావచ్చు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. లేదంటే ఫోన్ ఇంటర్వ్యూలతో అయినా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలాంటివేమీ జరగట్లేదు. సినిమాకు ముఖ చిత్రం అయిన అనుష్క ప్రమోషన్లకు పూర్తంగా దూరంగా ఉండటం, యాడ్స్ లాంటివేమీ కూడా లేకపోవడంతో ‘నిశ్శబ్దం’కు విడుదల ముంగిట ఆశించిన బజ్ లేకపోయింది. ఓటీటీలకు సినిమాల్ని ఇచ్చేశాక నిర్మాతలు ప్రమోషన్లను పట్టించుకోవట్లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అసలే కొత్త సినిమాలకు ఎక్కువ రేటిచ్చి తీసుకుంటుంటే అందుకు తగ్గ ఫలితం రావట్లేదని ఓటీటీలు నిరాశ వ్యక్తం చేస్తూ, రిలీజ్ తర్వాత కొంత డబ్బులు వెనక్కడిగే సంప్రదాయం మొదలవుతుంటే.. ఇలా ప్రమోషన్లు పట్టించుకోకుంటే మున్ముందు కష్టమే.
This post was last modified on September 28, 2020 8:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…