Political News

హేమంత్‌ను చంపే వరకు అన్నం తిననని..

పరువు హత్యల కథలు చాలా విన్నాం, ఐతే అగ్ర కులానికి చెందిన ఓ అమ్మాయి.. వేరే కులం అబ్బాయితో వెళ్లిపోయినపుడు ఆమె తండ్రి పగతో రగిలిపోయి దారుణాలకు ఒడిగట్టిన ఉదంతాల్ని పరిశీలిస్తే.. అమ్మాయి తల్లి చాలా వరకు ఇలాంటి దారుణాన్ని వ్యతిరేకించినట్లే వెల్లడవుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తండ్రి కూతురిని కాదనుకున్నప్పటికీ.. తనతో తల్లి చాటుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, కూతురు అల్లుడు బాగుండాలని కోరుకోవడం సహజం. సినిమాల్లో చూసినా, బయట ఉదంతాల్ని పరిశీలించినా మామూలుగా అయితే ఇదే జరుగుతుంది. కానీ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి అమ్మాయి కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురైన హేమంత్ ఉదంతంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. అతడి భార్య అవంతి కుటుంబ సభ్యులందరూ కలిసి అతణ్ని చంపడానికి ఏకమయ్యారు. అందులో అవంతి తల్లిది ప్రధాన పాత్రగా వెల్లడవుతుండటం గమనార్హం.

హేమంత్‌తో అవంతి ప్రేమ, పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన ఆమె తల్లి అర్చన.. హేమంత్‌ను చంపేవరకు తాను అన్నం ముట్టనని ఒట్టు పెట్టుకుందట. ఆమెను మరింతగా రెచ్చగొట్టిన సోదరుడుయుగేందర్ రెడ్డి హేమంత్ హత్యకు కుట్ర పన్నాడట. ఈ విషయాన్ని అవంతి స్వయంగా వెల్లడించింది. హేమంత్ తల్లి, తన తల్లి స్నేహితులే అని.. బ్యుటీషియన్ అయిన హేమంత్ తల్లి తమ ఇంటికి వచ్చి వెళ్తుండేదని.. తర్వాత తాను హేమంత్, ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నామని.. కానీ తమ పెళ్లి తన తల్లికి అస్సలు ఇష్టం లేదని.. దీంతో హేమంత్‌ను చంపాల్సిందే అని ఆమె పట్టుబట్టి కూర్చుందని.. అతణ్ని చంపేవరకు తాను అన్నం తినని శపథం చేసినట్లు తనకు తెలిసిందని అవంతి మీడియాకు వెల్లడించింది. ఈ వ్యవహారం తన పాత్రేమీ లేదన్నట్లుగా తన సోదరుడు అశిష్ రెడ్డి దూరంగా ఉంటున్నాడని.. కానీ కుట్రలో అతను కూడా భాగమే అని తన తల్లిదండ్రుల్ని బయటికి తీసుకురావడానికి అతను ప్రయత్నిస్తున్నాడని.. తనను కూడా అరెస్ట్ చేయాలని అవంతి డిమాండ్ చేసింది. హేమంత్ తల్లిదండ్రులే ఇకపై తన తల్లిదండ్రులని, వారితోనే ఉంటానని.. తన భర్త హత్యలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడే వరకు పోరాటం సాగిస్తానని ఆమె స్పష్టం చేసింది.

This post was last modified on September 28, 2020 8:22 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

24 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago