సుశాంత్ సింగ్ రాజ్పుత్ అన్యాయంగా ప్రాణాలు వదిలాడని.. అతడి మృతికి కారణమెవరో తేలాలని.. అతడికి న్యాయం జరగాలని తన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేస్తూ వచ్చారు మూడు నెలలుగా. ఐతే అతడి మృతి కేసు తేలడం సంగతటుంచితే.. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద రోజు రోజుకూ నిందలు పెరిగిపోతూ అతడి అప్రతిష్టపాలయ్యే పరిస్థితి తలెత్తుతోంది.
చనిపోయాక ఒకట్రెండు నెలల పాటు సుశాంత్ మంచి లక్షణాల గురించే చర్చ జరిగింది. అతడి గురించి అందరూ అయ్యో పాపం అన్నట్లే మాట్లాడారు. సుశాంత్కు సామాజిక మాధ్యమాల్లో లభించిన ఆదరణ చూసో ఏమో.. బాలీవుడ్లో ఎవ్వరూ కూడా అతడి గురించి నెగెటివ్గా ఒక్క మాట మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఈ కేసు టర్న్ తీసుకుని డ్రగ్స్ వైపు మళ్లడం ఆలస్యం వ్యవహారం మారుతూ వచ్చింది.
కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు, రియా చక్రవర్తి సహా కొందరు ఆంతరంగిక సంభాషణల్లో, అధికారుల ముందు మాట్లాడుతున్న మాటలు చూస్తే.. అతణ్ని ఒక పెద్ద డ్రగ్ ఎడిక్ట్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని వాళ్లన్నారు.. వీళ్లన్నారు అంటూ బాలీవుడ్లో అదే పనిగా వార్తలు వస్తున్నాయి. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందుకు విచారణ కోసం వెళ్లిన సుశాంత్ కోస్టార్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ కూడా సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా మీడియా సంస్థలు చెబుతున్నాయి.
ఐతే తనపై ఏ ఆరోపణ వచ్చినా ఖండించడానికి ఇప్పుడు సుశాంత్ లేడు. అతనేమీ బాలీవుడ్లో బడా ఫ్యామిలీకి చెందిన వాడు కాదు. బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇంకేముంది నింద అతడి మీదికి నెట్టేసి తాము సైడ్ అయిపోదామని బాలీవుడ్ తారలు చూస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఇప్పటికే సుశాంత్ మృతి కేసు పూర్తిగా పక్కదోవ పట్టగా.. తాజా పరిణామాలు చూస్తుంటే సుశాంత్ ఎంతగా వీలైతే అంతగా చెడగొట్టడానికీ ప్రయత్నం జరుగుతున్నట్లుంది.
This post was last modified on September 28, 2020 11:33 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…