సుశాంత్ సింగ్ రాజ్పుత్ అన్యాయంగా ప్రాణాలు వదిలాడని.. అతడి మృతికి కారణమెవరో తేలాలని.. అతడికి న్యాయం జరగాలని తన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేస్తూ వచ్చారు మూడు నెలలుగా. ఐతే అతడి మృతి కేసు తేలడం సంగతటుంచితే.. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద రోజు రోజుకూ నిందలు పెరిగిపోతూ అతడి అప్రతిష్టపాలయ్యే పరిస్థితి తలెత్తుతోంది.
చనిపోయాక ఒకట్రెండు నెలల పాటు సుశాంత్ మంచి లక్షణాల గురించే చర్చ జరిగింది. అతడి గురించి అందరూ అయ్యో పాపం అన్నట్లే మాట్లాడారు. సుశాంత్కు సామాజిక మాధ్యమాల్లో లభించిన ఆదరణ చూసో ఏమో.. బాలీవుడ్లో ఎవ్వరూ కూడా అతడి గురించి నెగెటివ్గా ఒక్క మాట మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఈ కేసు టర్న్ తీసుకుని డ్రగ్స్ వైపు మళ్లడం ఆలస్యం వ్యవహారం మారుతూ వచ్చింది.
కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు, రియా చక్రవర్తి సహా కొందరు ఆంతరంగిక సంభాషణల్లో, అధికారుల ముందు మాట్లాడుతున్న మాటలు చూస్తే.. అతణ్ని ఒక పెద్ద డ్రగ్ ఎడిక్ట్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని వాళ్లన్నారు.. వీళ్లన్నారు అంటూ బాలీవుడ్లో అదే పనిగా వార్తలు వస్తున్నాయి. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందుకు విచారణ కోసం వెళ్లిన సుశాంత్ కోస్టార్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ కూడా సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా మీడియా సంస్థలు చెబుతున్నాయి.
ఐతే తనపై ఏ ఆరోపణ వచ్చినా ఖండించడానికి ఇప్పుడు సుశాంత్ లేడు. అతనేమీ బాలీవుడ్లో బడా ఫ్యామిలీకి చెందిన వాడు కాదు. బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇంకేముంది నింద అతడి మీదికి నెట్టేసి తాము సైడ్ అయిపోదామని బాలీవుడ్ తారలు చూస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఇప్పటికే సుశాంత్ మృతి కేసు పూర్తిగా పక్కదోవ పట్టగా.. తాజా పరిణామాలు చూస్తుంటే సుశాంత్ ఎంతగా వీలైతే అంతగా చెడగొట్టడానికీ ప్రయత్నం జరుగుతున్నట్లుంది.
This post was last modified on September 28, 2020 11:33 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…