ఇంకో వారం రోజుల్లో సెప్టెంబర్ 5న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) రిలీజ్ కాబోతోంది. మాములుగా విజయ్ సినిమా అంటేనే ఓ రేంజ్ హడావిడి ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా తెలిసిందే. తెలుగులోనూ తన క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. గత ఏడాది బాలకృష్ణ, రవితేజ పోటీని తట్టుకుని లియో ఇక్కడ కమర్షియల్ గా సక్సెస్ కావడం అంటే మాటలు కాదు. అందుకే తన కొత్త మూవీ వస్తోందంటే దాని థియేటర్, డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. గోట్ కు మంచి సపోర్ట్ అయితే ఉంది కానీ ఆశించిన బజ్ లేదనేది ఫ్యాన్స్ భావన.
ఇక్కడ రెండు అంశాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. మొదటిది వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డు. నాగ చైతన్యతో కస్టడీ అనే కళాఖండం తీసింది ఈయనే. ఒకప్పుడు అజిత్ గ్యాంబ్లర్, సూర్య రాక్షసుడు లాంటి న్యూ ఏజ్ థ్రిల్లర్స్ తీశారు కానీ ఇప్పుడు ఫామ్ లో లేని డొల్లతనం చైతు మూవీలో బయట పడింది. సో వెంకట్ ప్రభు బ్రాండ్ పని చేయడం లేదు. ఇక విజయ్ సినిమాల స్థాయిని పదింతలు పెంచే అనిరుద్ రవిచందర్ స్థానంలో యువన్ శంకర్ రాజా రావడం బజ్ ని తగ్గించేసింది. పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ అంచనాలు పెంచడంలో అవి ఉపయోగపడలేదు.
వీటికి తోడు విజయ్ డీ ఏజింగ్ మీద వచ్చిన కామెంట్స్, నెగటివ్ ఫీడ్ బ్యాక్ డ్యామేజీని మరింత పెంచాయి. తమిళంలో ప్రమోషన్లు నాన్ స్టాప్ గా చేస్తున్నారు కానీ తెలుగులో ఇంకా మొదలుపెట్టలేదు. ఎలాగూ విజయ్ హైదరాబాద్ కు రాడు. సో హీరోయిన్ మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, లైలాలను తీసుకొచ్చి ఏదోలా మేనేజ్ చేయాలి. రాజకీయ పార్టీ పెట్టేసిన విజయ్ ఎన్నికలకు వెళ్లేముందు చేయబోయే చివరి రెండు సినిమాల్లో ఇది మొదటిది. ఆ కారణంగా అయినా కనివిని ఎరుగని హైప్ వస్తుందని అందరూ భావించారు. దానికి భిన్నంగా గోట్ పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఇదండీ కథ.
This post was last modified on August 28, 2024 4:31 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…