హీరో నాని, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి కలయికలో ఒక సినిమా రూపొందుతుందనే ప్రచారం గత ఏడాది గట్టిగా తిరిగింది. అయితే కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల డ్రాపయ్యారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు సరిపోదా శనివారం ప్రెస్ మీట్ లో నాని చెక్ పెట్టేశాడు. తన వెర్షన్ ప్రకారం బలగంని విపరీతంగా ఇష్టపడిన నాని దాన్ని చాలా చోట్ల ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రమోట్ చేశాడు. అంతగా హృదయాన్ని హత్తుకుంది. దీంతో వేణు కూడా నాని ఇంతగా తన చిత్రాన్ని దగ్గర చేసుకోవడం చూసి క్రమం తప్పకుండా టచ్ లో ఉండేవాడు.
ఓ సందర్భంగాలో దిల్ రాజు ఎలాంటి దర్శకుల కోసం చూస్తున్నావని నానికి అడిగారు. దానికి సమాధానం చెబుతూ వేణు మీద నాకు ఆసక్తి ఉంది, ఫెంటాస్టిక్ నటుడిగానే కాక డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అలాంటి కాంబో కోసం చూస్తున్నానని నాని అన్నాడు. సరదాగా మొదలైన ఈ సంభాషణ పలుమార్లు ముగ్గురి మధ్య డిస్కషన్ గా మారిపోయింది. ఇది కాస్తా బయటికి వెళ్లిపోవడంతో ఈ కాంబినేషన్ ఫిక్సనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతే తప్ప నిజంగా అప్పటికప్పుడు చేయాలనే ఆలోచన తప్ప కథ లేదని నాని చెప్పిన సారాంశం.
భవిష్యత్తులో మాత్రం వేణుతో ఖచ్చితంగా సినిమా చేసే అవకాశాన్ని నాని స్పష్టంగా చెప్పేశాడు. సో ఫ్యాన్స్ ఎదురు చూడొచ్చు. సరిపోదా శనివారం ప్రమోషన్ల మల్టీ లాంగ్వేజ్ ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్న నాని ఏ మాత్రం అలసట లేకుండా ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా చాలా విశ్లేషణాత్మకంగా, వివరంగా సమాధానం చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక మీమర్ నానిని విలన్ ఎస్జె సూర్యతో నటిస్తున్నప్పుడు భయం వేయలేదా అనే ప్రశ్నకు సంయమనం కోల్పోకుండా నాకెందుకు భయమంటూ కూల్ గా చెప్పిన తీరు వీడియో రూపంలో వైరలవుతోంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…