అనుకున్న దానికన్నా ఎక్కువగా డబుల్ ఇస్మార్ట్ ఫెయిల్ కావడం రామ్, పూరి జగన్నాధ్ ఇద్దరి అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి దక్కాల్సిన రెస్పాన్స్ ఇది కాదని బాధ పడుతున్నారు. పుష్ప 2 వదిలేసిన ఆగస్ట్ పదిహేను లాంటి మంచి సీజన్ ని చేతులారా వృథా చేసుకుని ఆయ్ లాంటి చిన్న చిత్రాలు దూసుకుపోయేలా చేయడం అంత ఈజీగా తీసిపారేసే మ్యాటర్ కాదు. దీనికి బాధ్యులు ఎవరనే దాని కన్నా టైటిల్ లో ఉన్న స్మార్ట్ నెస్ మేకింగ్ లో చూపించలేకపోయిన దర్శకుడు, దాన్ని స్క్రిప్ట్ స్టేజిలోనే గుర్తించలేకపోయిన హీరో ఇద్దరూ తలా సగం పంచుకోవాలి.
స్మార్ట్ గా ఆలోచించడం అంటే ఏమిటో అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు గమనించాలి. కమర్షియల్ సినిమా ఎప్పుడూ మాస్ పరిమితుల్లోనే ఉంటుంది. దాన్ని దాటి రిస్క్ చేయలేం. కాకపోతే కొత్త తరానికి తగ్గట్టు స్టయిలిష్ మేకింగ్ అంటే ఏంటో అవగాహన పెంచుకోవాలి. జైలర్ సంగతే చూస్తే అదేమీ అద్భుతమైన మాస్టర్ పీస్ కాదు. కమల్ హాసన్ భారతీయుడులో చెడ్డ కొడుకుని ఇందులో వాడారు. తాత వయసొచ్చిన హీరో తన కుటుంబం మీదకొచ్చిన వాళ్ళను అంతం చేయడమే పాయింట్. లియోలో తీసుకున్నది కనివిని ఎరుగని ప్లాట్ కాదు. జగపతిబాబు గాయం 2 ఛాయలు చాలా ఉంటాయి.
సలార్ తీసిన ప్రశాంత్ నీల్, యానిమల్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, కల్కితో ఋజువు చేసుకున్న నాగ్ అశ్విన్ వీళ్ళందరూ మోడరన్ మేకింగ్ కి ప్రతినిథులు. కానీ పూరి మాత్రం ఇంకా ఇరవై సంవత్సరాల నాటి బోకా లాంటి కామెడీలు, చిప్పు మారిపోయిన ఇస్మార్ట్ శంకర్ ట్విస్టుల మీదే ఆధారపడటం సంజయ్ దత్ లాంటి విలన్ ని సైతం డమ్మీని చేసింది. రామ్ కూడా మూసలో పడి మార్కెట్ ని ఎంత దెబ్బ తీసుకుంటున్నాడో ది వారియర్, స్కందలు హెచ్చరిక చేసినప్పటికీ కేవలం బ్రాండ్ ని నమ్ముకుని డబుల్ ఇస్మార్ట్ చేశాడు. కథలు మాస్ గా ఉండటం కాదు మేకింగ్, రైటింగ్ స్మార్ట్ గా ఉంటేనే హిట్లు పడతాయి.
This post was last modified on August 20, 2024 7:33 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…