టాలీవుడ్లో ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ మూవీస్ చేస్తూ.. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నటుడు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది ‘దసరా’ లాంటి ఊర మాస్ మూవీతో మెప్పించిన అతను.. ఆపై ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను ‘సరిపోదా శనివారం’ అనే క్లాస్, మాస్ మిక్స్ చేసిన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
నాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మొన్నటిదాకా కొంచెం గందరగోళం నెలకొంది. క్లారిటీ మిస్ అయింది. ‘బలగం’ ఫేమ్ వేణుతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కాగా.. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్తో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అలాగే హిట్-3 సంగతేంటి.. ‘దసరా’ తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెలతో జట్టు కడతాడా లేదా అనే డౌట్లు కూడా వచ్చాయి.
ఐతే ఇప్పుడు నాని లైనప్ మీద పూర్తి స్పష్టత వచ్చేసినట్లే కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెలతోనే నాని తర్వాతి చిత్రం ఉండబోతోంది. దాంతో పాటుగా హిట్-3ని కూడా సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు నాని. వీటి గురించి సెప్టెంబరు తొలి వారంలో అధికారిక ప్రకటనలు వస్తాయి. అంతే కాక సుజీత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా నాని తెరదించేశాడు.
సుజీత్తో సినిమాను కన్ఫమ్ చేయడమే కాక.. అభిమానులు ఎప్పట్నుంచో తనను చూడాలనుకుంటున్న పవర్ ఫుల్, ఫెరోషియస్, మాస్ అవతారంలో తనను సుజీత్ ప్రెజెంట్ చేయబోతున్నట్లు అతను చెప్పడం విశేషం. ‘ఓజీ’ లాంటి మెగా మూవీ తర్వాత నానితో సుజీత్ సినిమా చేయడమే కాక.. అతణ్ని పవర్ ఫుల్, మాస్ రోల్లో చూపించబోతున్నాడు అంటే నేచురల్ స్టార్ కెరీర్ మరో స్థాయికి వెళ్లబోతున్నట్లే. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చాలా ఎగ్జైటింగ్గా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 16, 2024 4:22 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…