టాలీవుడ్లో ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ మూవీస్ చేస్తూ.. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నటుడు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది ‘దసరా’ లాంటి ఊర మాస్ మూవీతో మెప్పించిన అతను.. ఆపై ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను ‘సరిపోదా శనివారం’ అనే క్లాస్, మాస్ మిక్స్ చేసిన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
నాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మొన్నటిదాకా కొంచెం గందరగోళం నెలకొంది. క్లారిటీ మిస్ అయింది. ‘బలగం’ ఫేమ్ వేణుతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కాగా.. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్తో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అలాగే హిట్-3 సంగతేంటి.. ‘దసరా’ తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెలతో జట్టు కడతాడా లేదా అనే డౌట్లు కూడా వచ్చాయి.
ఐతే ఇప్పుడు నాని లైనప్ మీద పూర్తి స్పష్టత వచ్చేసినట్లే కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెలతోనే నాని తర్వాతి చిత్రం ఉండబోతోంది. దాంతో పాటుగా హిట్-3ని కూడా సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు నాని. వీటి గురించి సెప్టెంబరు తొలి వారంలో అధికారిక ప్రకటనలు వస్తాయి. అంతే కాక సుజీత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా నాని తెరదించేశాడు.
సుజీత్తో సినిమాను కన్ఫమ్ చేయడమే కాక.. అభిమానులు ఎప్పట్నుంచో తనను చూడాలనుకుంటున్న పవర్ ఫుల్, ఫెరోషియస్, మాస్ అవతారంలో తనను సుజీత్ ప్రెజెంట్ చేయబోతున్నట్లు అతను చెప్పడం విశేషం. ‘ఓజీ’ లాంటి మెగా మూవీ తర్వాత నానితో సుజీత్ సినిమా చేయడమే కాక.. అతణ్ని పవర్ ఫుల్, మాస్ రోల్లో చూపించబోతున్నాడు అంటే నేచురల్ స్టార్ కెరీర్ మరో స్థాయికి వెళ్లబోతున్నట్లే. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చాలా ఎగ్జైటింగ్గా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 16, 2024 4:22 pm
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…