టాలీవుడ్లో ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ మూవీస్ చేస్తూ.. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నటుడు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది ‘దసరా’ లాంటి ఊర మాస్ మూవీతో మెప్పించిన అతను.. ఆపై ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను ‘సరిపోదా శనివారం’ అనే క్లాస్, మాస్ మిక్స్ చేసిన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
నాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మొన్నటిదాకా కొంచెం గందరగోళం నెలకొంది. క్లారిటీ మిస్ అయింది. ‘బలగం’ ఫేమ్ వేణుతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కాగా.. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్తో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అలాగే హిట్-3 సంగతేంటి.. ‘దసరా’ తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెలతో జట్టు కడతాడా లేదా అనే డౌట్లు కూడా వచ్చాయి.
ఐతే ఇప్పుడు నాని లైనప్ మీద పూర్తి స్పష్టత వచ్చేసినట్లే కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెలతోనే నాని తర్వాతి చిత్రం ఉండబోతోంది. దాంతో పాటుగా హిట్-3ని కూడా సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు నాని. వీటి గురించి సెప్టెంబరు తొలి వారంలో అధికారిక ప్రకటనలు వస్తాయి. అంతే కాక సుజీత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా నాని తెరదించేశాడు.
సుజీత్తో సినిమాను కన్ఫమ్ చేయడమే కాక.. అభిమానులు ఎప్పట్నుంచో తనను చూడాలనుకుంటున్న పవర్ ఫుల్, ఫెరోషియస్, మాస్ అవతారంలో తనను సుజీత్ ప్రెజెంట్ చేయబోతున్నట్లు అతను చెప్పడం విశేషం. ‘ఓజీ’ లాంటి మెగా మూవీ తర్వాత నానితో సుజీత్ సినిమా చేయడమే కాక.. అతణ్ని పవర్ ఫుల్, మాస్ రోల్లో చూపించబోతున్నాడు అంటే నేచురల్ స్టార్ కెరీర్ మరో స్థాయికి వెళ్లబోతున్నట్లే. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చాలా ఎగ్జైటింగ్గా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 16, 2024 4:22 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…