Movie News

ఇండియన్ సీక్వెల్స్.. 500 కోట్లా?

గత నెల ఇదే సమయంలో రిలీజై దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది ‘ఇండియన్-2’ సినిమా. ముందు నుంచే ఆ సినిమాకు హైప్ తక్కువే ఉంది. సినిమా బాగా ఆలస్యం కావడం, దీనికి తోడు ట్రైలర్ ఇంప్రెసివ్‌గా లేకపోవడంతో బజ్ క్రియేట్ కాలేదు.

ఐతే శంకర్ ఏదో ఒక మ్యాజిక్ చేసే ఉంటాడనే ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. శంకర్ కెరీర్లోనే అట్టడుగున నిలిచే చిత్రం ఇదే అనడంలో మరో మాట లేదు. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో నిర్మాతల పరిస్థితి ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ‘ఇండియన్-2’ బడ్జెట్ రూ.250 కోట్లని వార్తలు వచ్చాయి. ఐతే దీంతో పాటుగా మూడో పార్ట్ కూడా తీశారు కాబట్టి.. దానికి కూడా కలిపే ఈ బడ్జెట్ అనుకున్నారందరూ.

కానీ ‘ఇండియన్-2’; ‘ఇండియన్-3’కి కలిపి శంకర్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టించేశారట. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ‘ఇండియన్’ సీక్వెల్స్ బడ్జెట్ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పారు. ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఆరేళ్లు పట్టిందని.. మధ్యలో క్రేన్ ప్రమాదం జరిగి షూటింగ్ ఆగిపోవడం, బడ్జెట్ హద్దులు దాటిపోవడంతో శంకర్ మీద ఫిర్యాదు చేయడానికి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న తననే ‘లైకా’ అధినేత సుభాస్కరన్ సంప్రదించాడని ప్రసాద్ వెల్లడించారు. అప్పుడు శంకర్‌ను పిలిపించి మాట్లాడామని ప్రసాద్ తెలిపారు.

ముందు ఒక బడ్జెట్ అనుకున్నాక.. దాన్ని రూ.230 కోట్లకు పెంచి అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఐతే ఆ బడ్జెట్ కూడా సరిపోక ఇంకో రూ.170 కోట్లు ఇచ్చారని.. చివరికి దాన్ని కూడా మించిపోయి ఏకంగా రూ.500 కోట్లు ఖర్చయినట్లు తనకు సమాచారం ఉందని ప్రసాద్ వెల్లడించారు. ముందు శంకర్‌తో ఘర్షణ వైఖరే ఉన్నప్పటికీ.. సినిమా పూర్తి కావడం కోసం నిర్మాతలు ఆయనతో రాజీకి వెళ్లారని.. కానీ శంకర్ ప్రతిసారీ చెప్పిన బడ్జెట్లో సినిమా తీయకుండా అదనంగా భారీగా ఖర్చు పెట్టించాడని ‘లైకా’ అధినేతల కష్టాలను ఏకరవు పెట్టారు.

This post was last modified on August 14, 2024 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

3 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

3 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

4 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

4 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

5 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

6 hours ago