ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్లో సరైన మాస్ సినిమాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా.. తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకునే పూర్తి స్థాయి మాస్ మూవీ ఏదీ రాలేదు. ప్రభాస్ మూవీ ‘కల్కి’ సైతం మాస్ను పూర్తి స్థాయిలో మెప్పించలేదు.
ఐతే చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాస్ ప్రేక్షకులనే టార్గెట్ చేసిన రెండు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజవుతున్నాయి. అందులో ఒకటి మాస్ రాజా రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’ కాగా.. మరొకటి రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘డబుల్ ఇస్మార్ట్’. వీటితో పాటు తంగలాన్, ఆయ్ చిత్రాలు కూడా రిలీజవుతున్నప్పటికీ ప్రధానంగా మాస్ దృష్టి మిగతా రెండు చిత్రాల మీదే ఉంది.
రవితేజ సినిమా అంటేనే మాస్కు ఒక విందు భోజనంలా ఉంటుంది. మధ్యలో ఆయన కొంచెం వెరైటీ కోసం ట్రై చేసి దెబ్బ తిన్నారు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ ఆయన మార్కు సినిమాలా కనిపిస్తోంది. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్.. తన ఫేవరెట్ హీరోను అభిమానులు నచ్చేలా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించినట్లున్నాడు. ఈ సినిమా ప్రోమోలు, పాటలు అన్నీ కూడా మాస్కు చేరువ అయ్యాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ విషయానికి వస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ హిట్కు సీక్వెల్. మధ్యలో పూరి మూవీ ‘లైగర్’ తేడా కొట్టినా ‘డబుల్ ఇస్మార్ట్’కు మంచి హైపే క్రియేట్ అయింది. ఈ సినిమా పాటలు.. టీజర్, ట్రైలర్ కూడా మాస్ను ఆకర్షించాయి. అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ రెండు చిత్రాలూ మంచి ఊపు చూపిస్తున్నాయి. మరి కంటెంట్ కూడా బలంగా ఉంటే మాస్ ప్రేక్షకులు వీటికి బ్రహ్మరథం పట్టడం ఖాయం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…