సినిమా ఇండస్ట్రీలో దర్శకులు అంతా ఒక కంఫర్ట్ జోన్లోనే వుండడానికి ఇష్టపడతారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ అదే తరహా సినిమాలకు ఫిక్స్ అయిపోయాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ జోన్ నుంచి బయటకు రాలేదు. అలాగే అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ వచ్చింది. త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ సినిమాలను దాటి బయటకు రావడం లేదు. అదే విధంగా కొరటాల శివ సోషల్ మెసేజ్ మిళితమైన కమర్షియల్ సినిమాలు చేస్తుంటాడు. వేరే రకం సినిమాలు చేయాలని వున్నా కానీ కంఫర్ట్ జోన్ బయటకు వస్తే రిస్క్ అని డైరెక్టర్స్ ఫీలవుతుంటారు.
అలాగే చిన్న సినిమాలతో సక్సెస్ అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’తో బడ్జెట్ బాగా పెంచాడు. ఆ సినిమాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలు రావడంతో అతడితో డెబ్బయ్ కోట్ల సినిమా ఒకటి అనుకున్న దిల్ రాజు అది కాన్సిల్ చేసేసుకున్నాడు. నాగచైతన్యతో అమెరికా బ్యాక్డ్రాప్లో కాస్ట్లీ లవ్స్టోరీ ఒకటి ప్లాన్ చేసుకుంటూ వుంటే వేరే కథ చూడమని చైతన్య చెప్పేసాడు.
పది, పదిహేను కోట్ల బడ్జెట్లో చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేయమని దిల్ రాజు చెప్పినట్టు మీడియాలో రాస్తున్నారు. ఒక్కసారి కంఫర్ట్ జోన్ దాటి బయటకు రాగానే ఈ టాలెంటెడ్ దర్శకుడికి నెక్స్ట్ సినిమా ఏమిటనే క్లారిటీ కూడా రావడం లేదు. మిగతా అన్ని భాషలలో దర్శకులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కానీ టాలీవుడ్లో మాత్రం ధైర్యం చేయరంటే కారణమిదే.
This post was last modified on September 27, 2020 3:22 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…