సినిమా ఇండస్ట్రీలో దర్శకులు అంతా ఒక కంఫర్ట్ జోన్లోనే వుండడానికి ఇష్టపడతారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ అదే తరహా సినిమాలకు ఫిక్స్ అయిపోయాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఆ జోన్ నుంచి బయటకు రాలేదు. అలాగే అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ వచ్చింది. త్రివిక్రమ్ కూడా ఫ్యామిలీ సినిమాలను దాటి బయటకు రావడం లేదు. అదే విధంగా కొరటాల శివ సోషల్ మెసేజ్ మిళితమైన కమర్షియల్ సినిమాలు చేస్తుంటాడు. వేరే రకం సినిమాలు చేయాలని వున్నా కానీ కంఫర్ట్ జోన్ బయటకు వస్తే రిస్క్ అని డైరెక్టర్స్ ఫీలవుతుంటారు.
అలాగే చిన్న సినిమాలతో సక్సెస్ అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’తో బడ్జెట్ బాగా పెంచాడు. ఆ సినిమాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలు రావడంతో అతడితో డెబ్బయ్ కోట్ల సినిమా ఒకటి అనుకున్న దిల్ రాజు అది కాన్సిల్ చేసేసుకున్నాడు. నాగచైతన్యతో అమెరికా బ్యాక్డ్రాప్లో కాస్ట్లీ లవ్స్టోరీ ఒకటి ప్లాన్ చేసుకుంటూ వుంటే వేరే కథ చూడమని చైతన్య చెప్పేసాడు.
పది, పదిహేను కోట్ల బడ్జెట్లో చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేయమని దిల్ రాజు చెప్పినట్టు మీడియాలో రాస్తున్నారు. ఒక్కసారి కంఫర్ట్ జోన్ దాటి బయటకు రాగానే ఈ టాలెంటెడ్ దర్శకుడికి నెక్స్ట్ సినిమా ఏమిటనే క్లారిటీ కూడా రావడం లేదు. మిగతా అన్ని భాషలలో దర్శకులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కానీ టాలీవుడ్లో మాత్రం ధైర్యం చేయరంటే కారణమిదే.
This post was last modified on September 27, 2020 3:22 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…