గత ఏడాది రెండు ఘనవిజయాలు దసరా, హాయ్ నాన్న రూపంలో సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఈసారి సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. భారీ అభిమాన సందోహం మధ్య వేడుకను నిర్వహించారు. అంటే సుందరానికి తర్వాత పూర్తి విభిన్నమైన జానర్ తో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ చేతులు కలిపారు. అంచనాల పరంగా ఓ రేంజ్ హైప్ మోస్తున్న సరిపోదా శనివారం కంటెంట్ మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది.
కథను దాచే ప్రయత్నం చేయలేదు. సోకులపాలెంలో పుట్టడమే నేరంగా భావించే చోట పోలీస్ ఆఫీసర్ దయ (ఎస్జె సూర్య) అక్కడి ప్రజల మీద కిరాతకంగా విరుచుకు పడుతూ ఉంటాడు. ఎంత కోపం వచ్చినా అణుచుకుని దానికి కారణమైన వాళ్ళను శనివారం వెతికి మరీ బుద్ధిచెప్పే సూర్య (నాని) కు ఆ వాడకు వెళ్లాల్సిన అవసరం పడుతుంది. తండ్రి (సాయికుమార్) వద్దని వారించినా దయతో తలపడేందుకు సిద్ధ పడతాడు. యముడు, చిత్రగుప్తుడు ఒకే మనిషిలో ఉంటే ఏమవుతుందో నిలువెత్తు రూపంగా కనిపించే సూర్య సోకులపాలెం జనాన్ని కాపాడేందుకు దయా దుర్మార్గాన్ని ఎలా ఎదిరించాడనేది తెరమీద చూడాలి.
తన స్టయిల్ కి భిన్నంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంని ఒక కంప్లీట్ యాక్షన్ కం రివెంజ్ థ్రిల్లర్ గా రూపొందించిన తీరు ఆసక్తిని పెంచేలా ఉంది. పెద్ద క్యాస్టింగ్, భారీ బడ్జెట్ తో పాటు గతంలో వినని ఒక స్టోరీ పాయింట్ తీసుకుని అంచనాలు పెంచడంలో సక్సెసయ్యాడు. జేక్స్ బిజోయ్ బీజీఎమ్ ఎలివేషన్ ని మరో స్థాయికి తీసుకెళ్లగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వాడే పోతారు అందరూ పోతారు ఊతపదాన్ని నానితో పలికించడం పేలింది. కానిస్టేబుల్ గా ప్రియాంక మోహన్ అలా మెరిసింది. నెలాఖరులో దసరాని మించే మాస్ మసాలా విందు భోజనానికి సూర్య అందించిన ఆహ్వానం ఉత్సుకత రేపడంలో విజయవంతమయ్యింది.
This post was last modified on August 13, 2024 10:43 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…