Movie News

పూరి మీద విజయేంద్రప్రసాద్ అభిమానం

దర్శకధీర రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారికి కొడుకు కాకుండా బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాధ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొబైల్ వాల్ పేపర్ గా పూరి ఫోటోనే ఉంటుందని పెద్దాయన చెప్పడం కొన్నేళ్ల క్రితం వైరలయ్యింది.

అయితే ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో నిన్న జరిగిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి బయట పడింది. ప్రత్యేకంగా అతిథులు లేకుండా క్యాస్ట్ అండ్ క్రూ హాజరైన ఈ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా పూరి ఒక ముచ్చట పంచుకున్నారు.

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ కు విజయేంద్ర ప్రసాద్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. నీ లాంటి దర్శకులు ఫెయిలవ్వడం తనకు బాధ కలిగిస్తుందని, తర్వాత సినిమా చేయబోయే ముందు కథ ఒక్కసారి తనకు వినిపించమని ఆయన అడిగారు.

ఒకవేళ పొరపాట్లు ఏమైనా ఉంటే రైటర్ గా సలహాలు ఇద్దామని ఆయన ఉద్దేశం. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఇంట్లోనే ఉన్నా తన మీద ఇంత ప్రేమ చూపించిన విజయేంద్ర గారి సలహాకు పూరి కదిలిపోయాడు. డబుల్ ఇస్మార్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి రుజువు చేయాలని నిర్ణయించుకుని, స్టోరీ ఆయనకు చెప్పకుండానే జాగ్రత్తగా పూర్తి చేశాడు.

ఇదంతా పూరి జగన్నాధ్ స్వయంగా చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది. నిజమే మరి. ఒకప్పుడు పోకిరి, ఇడియట్ లాంటి ట్రెండ్ సెట్టర్స్ తో పాటు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ తీసిన పూరి లైగర్ లాంటి బ్యాడ్ కంటెంట్ తో వచ్చినపుడు ఎవరికైనా బాధ కలుగుతుంది.

కానీ టీమ్ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకం బలంగా కనిపిస్తోంది. హీరో రామ్ కు సైతం దీని సక్సెస్ చాలా కీలకం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊర మాస్ కంటెంట్ వచ్చి నెలలు గడిగిపోతున్న తరుణంలో డబుల్ ఇస్మార్ట్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

This post was last modified on August 12, 2024 10:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

46 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

55 minutes ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

5 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

6 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

6 hours ago