Movie News

పూరి మీద విజయేంద్రప్రసాద్ అభిమానం

దర్శకధీర రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారికి కొడుకు కాకుండా బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాధ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొబైల్ వాల్ పేపర్ గా పూరి ఫోటోనే ఉంటుందని పెద్దాయన చెప్పడం కొన్నేళ్ల క్రితం వైరలయ్యింది.

అయితే ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో నిన్న జరిగిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి బయట పడింది. ప్రత్యేకంగా అతిథులు లేకుండా క్యాస్ట్ అండ్ క్రూ హాజరైన ఈ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా పూరి ఒక ముచ్చట పంచుకున్నారు.

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ కు విజయేంద్ర ప్రసాద్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. నీ లాంటి దర్శకులు ఫెయిలవ్వడం తనకు బాధ కలిగిస్తుందని, తర్వాత సినిమా చేయబోయే ముందు కథ ఒక్కసారి తనకు వినిపించమని ఆయన అడిగారు.

ఒకవేళ పొరపాట్లు ఏమైనా ఉంటే రైటర్ గా సలహాలు ఇద్దామని ఆయన ఉద్దేశం. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఇంట్లోనే ఉన్నా తన మీద ఇంత ప్రేమ చూపించిన విజయేంద్ర గారి సలహాకు పూరి కదిలిపోయాడు. డబుల్ ఇస్మార్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి రుజువు చేయాలని నిర్ణయించుకుని, స్టోరీ ఆయనకు చెప్పకుండానే జాగ్రత్తగా పూర్తి చేశాడు.

ఇదంతా పూరి జగన్నాధ్ స్వయంగా చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది. నిజమే మరి. ఒకప్పుడు పోకిరి, ఇడియట్ లాంటి ట్రెండ్ సెట్టర్స్ తో పాటు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ తీసిన పూరి లైగర్ లాంటి బ్యాడ్ కంటెంట్ తో వచ్చినపుడు ఎవరికైనా బాధ కలుగుతుంది.

కానీ టీమ్ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకం బలంగా కనిపిస్తోంది. హీరో రామ్ కు సైతం దీని సక్సెస్ చాలా కీలకం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊర మాస్ కంటెంట్ వచ్చి నెలలు గడిగిపోతున్న తరుణంలో డబుల్ ఇస్మార్ట్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

This post was last modified on August 12, 2024 10:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

34 minutes ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

2 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

3 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

3 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

3 hours ago

అంబటి… ఈ సారైనా రిలీజయ్యేనా?

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago