ప్రపంచవ్యాప్తంగా కరోనా టైంలో అందరు ఫిలిం మేకర్స్ పని మానేసి, తగ్గించేసి కూర్చుంటే.. రామగోపాల్ వర్మ మాత్రం జెట్ స్పీడుతో పని చేస్తున్నారు. లాక్ డౌన్ టైంలో ఆయన అరడజను సినిమాలు చేయడం విశేషం. వాటి కంటెంట్ ఎంత మాత్రం.. వాటి స్థాయి ఏంటి అన్నది పక్కన పెడితే.. ఇప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ చేసి ఇంకో రెండు విడుదలకు సిద్ధం చేశాడు వర్మ.
అందులో ఒకదాని ట్రైలర్ తాజా రిలీజైంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ‘దిశ ఎన్కౌంటర్’ అని పేరు పెట్టి ఆ దారుణ ఘటన, తదనంతర పరిణామాల మీద సినిమా తీయించాడు వర్మ. ఆయన సమర్పణలో నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించాడు.
ఐతే రెండున్నర నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే వర్మ అండ్ టీం కొత్తగా ఏం చూపించిందన్నది అర్థం కావడం లేదు. ఈ ఉదంతం జరిగినపుడు పేపర్లలో, వెబ్ సైట్లలో ఏమైతే చదివామో.. ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నామో యాజిటీజ్ అదే చూపించినట్లుంది. సామాన్య జనాలకు తెలియని, మీడియా వెల్లడించని తెరవెనుక, కొత్త విషయాలైతే ఏమీ ఈ సినిమాలో కనిపిస్తాయన్న సంకేతాలేమీ ట్రైలర్ ఇవ్వలేదు.
ఈ ఉదంతాన్ని తెరమీద చూపించి జనాల్లో వర్మ అండ్ టీం చైతన్యం తెస్తుందని ఆశించే అవకాశాలు ఎలాగూ లేవు. మరి ఆ సంఘటనల వరుస క్రమాన్ని చూపిస్తూ సినిమా తీయడం వల్ల ఏం ప్రయోజనమో ఏమో? పే పర్ వ్యూ పద్ధతిలో వర్మ మొదట్లో రిలీజ్ చేసిన సినిమాలకు కొంచెం స్పందన వచ్చింది కానీ.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవట్లేదు. ఈ వరుసగా మిర్యాలగూడ ప్రణయ్-అమృతల ఉదంతం మీద తీసిన సినిమా పట్ల కూడా ఏమంత ఆసక్తి కనిపించలేదు. లీగల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా విడుదలకు కూడా నోచుకోలేదు. మరి ‘దిశ ఎన్కౌంటర్’ సినిమా సంగతి ఏమవుతుందో చూడాలి.
This post was last modified on September 26, 2020 6:16 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…