ఆ మధ్య రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ లో ఉంటుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించాక ఒక్కసారిగా ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అయితే నిజంగా వస్తుందా లేక దర్శకుడు శంకర్ మళ్ళీ వాయిదా వేయిస్తాడా అనే అనుమానాలు వాళ్లలో లేకపోలేదు. దానికి తగ్గట్టే మార్చికి పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఏమి లేదని ఎస్విసి టీమ్ నుంచి వివిధ రూపాల్లో క్లారిటీ వస్తూనే ఉంది. తాజాగా డబ్బింగ్ పనులు మొదలుపెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్రిస్మస్ రిలీజని ప్రత్యేకంగా మరోసారి పేర్కొన్నారు.
సో గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 రావడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నాగచైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ లు డేట్లు మార్చుకోవాల్సి రావొచ్చు. అయితే పుష్ప డిసెంబర్ 6నే వస్తున్న నేపథ్యంలో రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాల మధ్య పధ్నాలుగు రోజుల గ్యాప్ సరిపోతుందా అనేది ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మూవీకి కనీసం నెలపాటు బలమైన రన్ ఉంటుందని ఇటీవలే కల్కి 2898 ఏడి నిరూపించింది. మరి రామ్ చరణ్, అల్లు అర్జున్ తక్కువ వ్యవధిలో తలపెడితే పరస్పరం థియేటర్ రెవిన్యూ మీద ప్రభావం పడొచ్చు.
కానీ ఇంతకన్నా ఆప్షన్ లేదు. పుష్ప ముందుకు జరగలేదు. గేమ్ ఛేంజర్ వెనక్కు పోలేదు. రెండు చాలాసార్లు వాయిదాలు ఎదుర్కొని అవాంతరాలు దాటుకుని ఇక్కడిదాకా వచ్చాయి. ఫేస్ టు ఫేస్ క్లాష్ రాకపోవడం కొంత ఊరటని చెప్పాలి. దర్శకుడు శంకర్ చాలా స్పష్టంగా డిసెంబర్ డెడ్ లైన్ కి కట్టుబడి ఉండటంతో దిల్ రాజు కాన్ఫిడెంట్ గా రిలీజ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. జరగండి జరగండి పాట తప్ప ఇంకే ప్రమోషన్ మెటీరియల్ రాని నేపథ్యంలో ఈ నెల 15 నుంచి కొత్తవి ఇవ్వాలనే ప్లాన్ లో ఎస్విసి బృందం ఉందట. సో ఫైనల్ గా మెగాభిమానులు హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చన్న మాట.
This post was last modified on August 8, 2024 12:29 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…