మూడేళ్ళ క్రితం ధనుష్ కర్ణన్ తమిళంలో పెద్ద బ్లాక్ బస్టర్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొంది విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను సాధించింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ కార్యరూపం దాల్చలేదు. రెండు పల్లెటూళ్ళ మధ్య కుల వివక్ష పాయింట్ ఆధారంగా చేసుకుని ఒక బస్ స్టాప్ చుట్టూ నడిపించిన ఈ విలేజ్ డ్రామా మన దగ్గర డబ్బింగ్ కాకపోయినా మూవీ లవర్స్ సబ్ టైటిల్స్ సహాయంతో ఓటిటిలో చూసేశారు. కథలో నేటివిటీ సమస్య కూడా ఉండటంతో కర్ణన్ తీయకపోవడమే మంచిదయ్యింది.
కట్ చేస్తే ఇటీవలే గరుడన్ అనే మరో మూవీ వచ్చింది. కమెడియన్ సూరి టైటిల్ రోల్ పోషించగా శశికుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. కోట్ల రూపాయల విలువైన గుడి భూములకు, ముగ్గురు స్నేహితులకు ముడిపెట్టి దురై సెంథిల్ కుమార్ తీర్చిదిద్దిన విధానం సూపర్ హిట్ అందించింది. విశేషం ఏంటంటే దీనికి కథను అందించి, నిర్మించింది కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈయన బ్రాండ్ ఈ సినిమా మార్కెటింగ్ లో బాగా ఉపయోగపడింది. ఇప్పుడీ గరుడన్ ని తెలుగులో సాయి శ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ కాంబోలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఇది అధికారికంగా చెప్పలేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి సెటప్ గట్రా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గరుడన్ కు కీలకమైన మార్పులు చేస్తే తగిన డెప్త్ ఉన్న కథే. రివెంజ్ డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే గ్లామర్ టచ్, రెగ్యులర్ ఫైట్స్ లాంటి వాటికి అవకాశం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటివి చేయడం అవసరమే. రొటీన్ మూస లో కొట్టుకుపోతూ థియేటర్లకు జనాలను రానివ్వకుండా చేస్తున్న పాత చింతకాయ కంటెంట్ కంటే గరుడన్ లాంటి ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వేచి చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…