మూడేళ్ళ క్రితం ధనుష్ కర్ణన్ తమిళంలో పెద్ద బ్లాక్ బస్టర్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొంది విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను సాధించింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నించారు కానీ కార్యరూపం దాల్చలేదు. రెండు పల్లెటూళ్ళ మధ్య కుల వివక్ష పాయింట్ ఆధారంగా చేసుకుని ఒక బస్ స్టాప్ చుట్టూ నడిపించిన ఈ విలేజ్ డ్రామా మన దగ్గర డబ్బింగ్ కాకపోయినా మూవీ లవర్స్ సబ్ టైటిల్స్ సహాయంతో ఓటిటిలో చూసేశారు. కథలో నేటివిటీ సమస్య కూడా ఉండటంతో కర్ణన్ తీయకపోవడమే మంచిదయ్యింది.
కట్ చేస్తే ఇటీవలే గరుడన్ అనే మరో మూవీ వచ్చింది. కమెడియన్ సూరి టైటిల్ రోల్ పోషించగా శశికుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. కోట్ల రూపాయల విలువైన గుడి భూములకు, ముగ్గురు స్నేహితులకు ముడిపెట్టి దురై సెంథిల్ కుమార్ తీర్చిదిద్దిన విధానం సూపర్ హిట్ అందించింది. విశేషం ఏంటంటే దీనికి కథను అందించి, నిర్మించింది కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్. ఈయన బ్రాండ్ ఈ సినిమా మార్కెటింగ్ లో బాగా ఉపయోగపడింది. ఇప్పుడీ గరుడన్ ని తెలుగులో సాయి శ్రీనివాస్ – నారా రోహిత్ – మంచు మనోజ్ కాంబోలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఇది అధికారికంగా చెప్పలేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి సెటప్ గట్రా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గరుడన్ కు కీలకమైన మార్పులు చేస్తే తగిన డెప్త్ ఉన్న కథే. రివెంజ్ డ్రామాతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాకపోతే గ్లామర్ టచ్, రెగ్యులర్ ఫైట్స్ లాంటి వాటికి అవకాశం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటివి చేయడం అవసరమే. రొటీన్ మూస లో కొట్టుకుపోతూ థియేటర్లకు జనాలను రానివ్వకుండా చేస్తున్న పాత చింతకాయ కంటెంట్ కంటే గరుడన్ లాంటి ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా వేచి చూడాలి.
This post was last modified on August 3, 2024 11:55 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…