గత నెల జూలై 12న విడుదలై భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న భారతీయుడు 2 కథ ఇంకా అయిపోలేదు. థియేట్రికల్ రన్ ముగిసిపోయి అభిమానులు మర్చిపోయే పనిలో ఉన్నారు కానీ నిర్మాతలకు మాత్రం ఇంకా దీని తాలూకు తలనెప్పులు తగ్గిపోలేదు. సరే బొమ్మ పోతే పోయింది ఓటిటిలో చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు గట్టిగానే ఉన్నారు.
అయితే వాళ్ళ ఆశలు అంత సులభంగా నెరవేరేలా లేవని డిజిటల్ వర్గాల కథనం. ఇండియన్ 2 హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఒప్పందం చేసుకుంది. సుమారు 120 కోట్ల దాకా ఇచ్చేందుకు రిలీజ్ కు ముందు అగ్రిమెంట్ జరిగిందట.
తీరా చూస్తే ఇంత ఘోరంగా ఇండియన్ 2 డిజాస్టర్ కావడం చూసి షాక్ తిన్న నెట్ ఫ్లిక్స్ సంస్థ చెల్లించడానికి ఒప్పుకున్న సొమ్ములో ఇప్పుడు కోత పెట్టే ప్రతిపాదన పెట్టిందని సమాచారం. దానికి ఒప్పుకుంటేనే ఇండియన్ 3కి సంబంధించిన డీల్ మాట్లాడుకుందామని చెప్పడంతో షాక్ తిన్న నిర్మాణ సంస్థ ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుందని వినికిడి.
ఎందుకంటే ఖర్చు పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన థియేటర్ రెవిన్యూకి ఎక్కడా పొంతన లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి నష్టాల నివారణకు ఏదైనా చర్య తీసుకోమని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదింకా సెటిల్ చేయాల్సి ఉంది.
ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడటంతో భారతీయుడు 2 తాతయ్యని ఓటిటిలో చూస్తామా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో రజనీకాంత్ లాల్ సలామ్, టైగర్ శ్రోఫ్ గణపథ్ లు సైతం నెట్ ఫ్లిక్స్ గడప దగ్గరే ఆగిపోయాయి.
కారణాలు ఇవేనా కాదానేది పక్కన పెడితే సదరు ఓటిటి సంస్థ ఫలితాల విషయంలో ఎంత కఠినంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. తీసికట్టు కంటెంట్ మొహాన కొడితే వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెబుతోంది. 2025 వేసవికి ప్లాన్ చేసుకున్న భారతీయుడు 3 బిజినెస్ మీద ఇదంతా తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.
This post was last modified on August 1, 2024 11:41 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…