గత నెల జూలై 12న విడుదలై భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న భారతీయుడు 2 కథ ఇంకా అయిపోలేదు. థియేట్రికల్ రన్ ముగిసిపోయి అభిమానులు మర్చిపోయే పనిలో ఉన్నారు కానీ నిర్మాతలకు మాత్రం ఇంకా దీని తాలూకు తలనెప్పులు తగ్గిపోలేదు. సరే బొమ్మ పోతే పోయింది ఓటిటిలో చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు గట్టిగానే ఉన్నారు.
అయితే వాళ్ళ ఆశలు అంత సులభంగా నెరవేరేలా లేవని డిజిటల్ వర్గాల కథనం. ఇండియన్ 2 హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఒప్పందం చేసుకుంది. సుమారు 120 కోట్ల దాకా ఇచ్చేందుకు రిలీజ్ కు ముందు అగ్రిమెంట్ జరిగిందట.
తీరా చూస్తే ఇంత ఘోరంగా ఇండియన్ 2 డిజాస్టర్ కావడం చూసి షాక్ తిన్న నెట్ ఫ్లిక్స్ సంస్థ చెల్లించడానికి ఒప్పుకున్న సొమ్ములో ఇప్పుడు కోత పెట్టే ప్రతిపాదన పెట్టిందని సమాచారం. దానికి ఒప్పుకుంటేనే ఇండియన్ 3కి సంబంధించిన డీల్ మాట్లాడుకుందామని చెప్పడంతో షాక్ తిన్న నిర్మాణ సంస్థ ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుందని వినికిడి.
ఎందుకంటే ఖర్చు పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన థియేటర్ రెవిన్యూకి ఎక్కడా పొంతన లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి నష్టాల నివారణకు ఏదైనా చర్య తీసుకోమని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదింకా సెటిల్ చేయాల్సి ఉంది.
ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడటంతో భారతీయుడు 2 తాతయ్యని ఓటిటిలో చూస్తామా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో రజనీకాంత్ లాల్ సలామ్, టైగర్ శ్రోఫ్ గణపథ్ లు సైతం నెట్ ఫ్లిక్స్ గడప దగ్గరే ఆగిపోయాయి.
కారణాలు ఇవేనా కాదానేది పక్కన పెడితే సదరు ఓటిటి సంస్థ ఫలితాల విషయంలో ఎంత కఠినంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. తీసికట్టు కంటెంట్ మొహాన కొడితే వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెబుతోంది. 2025 వేసవికి ప్లాన్ చేసుకున్న భారతీయుడు 3 బిజినెస్ మీద ఇదంతా తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.
This post was last modified on August 1, 2024 11:41 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…