పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోల్డ్లో పెట్టిన మూడు చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఐతే పవన్ మళ్లీ అందుబాటులోకి వస్తే.. ఆయన ప్రయారిటీ లిస్ట్లో ఇదే చివరన ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. కొందరేమో ఈ సినిమా ముందుకు కదలడం కష్టమని.. మధ్యలో ఆపేస్తారని కూడా అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం గురించి ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ ప్రెస్ మీట్లో దర్శకుడు హరీష్ శంకర్ను అడిగితే.. సమాధానం దాటవేశాడు. ఫ్యాన్స్ గురించి ప్రస్తావిస్తే నేను వాళ్లతోనే మాట్లాడుకుంటాను అనేశాడు.
ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ ఈ చిత్రం గురించి మాట్లాడాడు. పవన్ కోసం ఎదురు చూస్తున్నామని.. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని చెప్పిన హరీష్.. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులు గుర్తుంచుకునేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు.
“పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు క్యాసెట్లు, డీవీడీలు దాచుకునేవాళ్లం కదా. అలా లైబ్రరీలో దాచుకునే సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏం ఆశించి థియేటర్లకు వస్తారో అవన్నీ సంపూర్ణంగా ఉండే సినిమా. ఫ్యాన్స్ రిపీట్స్లో ఈ సినిమ ా చూస్తారు” అని హరీష్ తెలిపాడు.
ఈ సినిమా చాలా ఆలస్యం కావడం, తన కెరీర్లో విలువైన కొన్నేళ్లు వేస్ట్ అయిపోవడం గురించి ప్రస్తావించగా.. “ముందు నా కెరీర్లో గ్యాప్ రావడానికి కరోనా కారణం. దాని వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల నా సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ఇందులో రాజకీయాలు ఉన్నాయని నేను అనుకోను. పవన్ గారిని మరో దర్శకుడు మెప్పించి తన చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాడంటే అది అతడి ప్రతిభ. అంతే తప్ప నేను ఎవరినీ నిందించను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యం కావడంతో నేను ‘మిస్టర్ బచ్చన్’ మొదలుపెట్టి ఏడు నెలల్లో పూర్తి చేశా. నా కెరీర్లోనే అత్యంత వేగంగా తీసిన సినిమా ఇది. ఇక ముందు మరింత వేగంగా మూవీస్ చేస్తా” అని హరీష్ అన్నాడు.
This post was last modified on July 30, 2024 1:51 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…