పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోల్డ్లో పెట్టిన మూడు చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఐతే పవన్ మళ్లీ అందుబాటులోకి వస్తే.. ఆయన ప్రయారిటీ లిస్ట్లో ఇదే చివరన ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. కొందరేమో ఈ సినిమా ముందుకు కదలడం కష్టమని.. మధ్యలో ఆపేస్తారని కూడా అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం గురించి ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ ప్రెస్ మీట్లో దర్శకుడు హరీష్ శంకర్ను అడిగితే.. సమాధానం దాటవేశాడు. ఫ్యాన్స్ గురించి ప్రస్తావిస్తే నేను వాళ్లతోనే మాట్లాడుకుంటాను అనేశాడు.
ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ ఈ చిత్రం గురించి మాట్లాడాడు. పవన్ కోసం ఎదురు చూస్తున్నామని.. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని చెప్పిన హరీష్.. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులు గుర్తుంచుకునేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు.
“పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు క్యాసెట్లు, డీవీడీలు దాచుకునేవాళ్లం కదా. అలా లైబ్రరీలో దాచుకునే సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏం ఆశించి థియేటర్లకు వస్తారో అవన్నీ సంపూర్ణంగా ఉండే సినిమా. ఫ్యాన్స్ రిపీట్స్లో ఈ సినిమ ా చూస్తారు” అని హరీష్ తెలిపాడు.
ఈ సినిమా చాలా ఆలస్యం కావడం, తన కెరీర్లో విలువైన కొన్నేళ్లు వేస్ట్ అయిపోవడం గురించి ప్రస్తావించగా.. “ముందు నా కెరీర్లో గ్యాప్ రావడానికి కరోనా కారణం. దాని వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల నా సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ఇందులో రాజకీయాలు ఉన్నాయని నేను అనుకోను. పవన్ గారిని మరో దర్శకుడు మెప్పించి తన చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాడంటే అది అతడి ప్రతిభ. అంతే తప్ప నేను ఎవరినీ నిందించను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యం కావడంతో నేను ‘మిస్టర్ బచ్చన్’ మొదలుపెట్టి ఏడు నెలల్లో పూర్తి చేశా. నా కెరీర్లోనే అత్యంత వేగంగా తీసిన సినిమా ఇది. ఇక ముందు మరింత వేగంగా మూవీస్ చేస్తా” అని హరీష్ అన్నాడు.
This post was last modified on July 30, 2024 1:51 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…