Movie News

టెన్షన్ ఫ్రీగా ఉన్న డబుల్ ఇస్మార్ట్

హీరో దర్శకుడు ఇద్దరూ చెరో డిజాస్టర్ తర్వాత చేతులు కలిపినప్పుడు ఆ ప్రాజెక్టు మీద సహజంగానే బజ్ తగ్గుతుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో అలాంటి సూచనలు లేవు. మిస్టర్ బచ్చన్, తంగలాన్ తో పాటు బాలీవుడ్ లో స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదా రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్రేజ్ పరంగా అందరికంటే ఒక అడుగు ముందు ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను సుమారు 60 కోట్లకు విక్రయించగా ఓటిటిని అమెజాన్ ప్రైమ్ 33 కోట్లకు కొనుగోలు చేసిందన్న వార్త అభిమానులలకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇక ఆడియో, హిందీ డబ్బింగ్ శాటిలైట్, డిజిటల్ కలిపి మరో 50 కోట్ల దాకా రావొచ్చనే అంచనా నిజమైనా ఆశ్చర్యం లేదు. ఇంత భారీ మొత్తంలో ఆఫర్లు రావడం చూస్తే ఇస్మార్ట్ శంకర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఆగస్ట్ మొదటివారంలోనే సెన్సార్ లాంఛనం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు వగైరా బోలెడు కవర్ చేయాల్సి ఉంటుంది. చేతిలో ఉన్నదేమో కేవలం 18 రోజులు. అయితే ఆందోళన చెందడానికి ఏమి లేదు. అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగిపోతున్నాయి.

ఇప్పటిదాకా వచ్చిన పాటలు, ప్రోమోలు హైప్ కి సరిపోయేలా ఉన్నాయి. వాటిని మరింత పెంచే బాధ్యతను ట్రయిలర్ తీసుకోబోతోంది. దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. హిందీ మార్కెట్ లోనూ దీనికి పబ్లిసిటీ వచ్చేలా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ బృందం ముంబై టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ విజయం మీద పూరి జగన్నాథ్ తర్వాతి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. తల్వార్ పేరుతో ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉందట. సాలిడ్ కంబ్యాక్ ఖచ్చితంగా చేస్తాననే నమ్మకం సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆగస్ట్ 15 దాకా వెయిట్ చేయాలి.

This post was last modified on July 27, 2024 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago