హీరో దర్శకుడు ఇద్దరూ చెరో డిజాస్టర్ తర్వాత చేతులు కలిపినప్పుడు ఆ ప్రాజెక్టు మీద సహజంగానే బజ్ తగ్గుతుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో అలాంటి సూచనలు లేవు. మిస్టర్ బచ్చన్, తంగలాన్ తో పాటు బాలీవుడ్ లో స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదా రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్రేజ్ పరంగా అందరికంటే ఒక అడుగు ముందు ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను సుమారు 60 కోట్లకు విక్రయించగా ఓటిటిని అమెజాన్ ప్రైమ్ 33 కోట్లకు కొనుగోలు చేసిందన్న వార్త అభిమానులలకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇక ఆడియో, హిందీ డబ్బింగ్ శాటిలైట్, డిజిటల్ కలిపి మరో 50 కోట్ల దాకా రావొచ్చనే అంచనా నిజమైనా ఆశ్చర్యం లేదు. ఇంత భారీ మొత్తంలో ఆఫర్లు రావడం చూస్తే ఇస్మార్ట్ శంకర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఆగస్ట్ మొదటివారంలోనే సెన్సార్ లాంఛనం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు వగైరా బోలెడు కవర్ చేయాల్సి ఉంటుంది. చేతిలో ఉన్నదేమో కేవలం 18 రోజులు. అయితే ఆందోళన చెందడానికి ఏమి లేదు. అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగిపోతున్నాయి.
ఇప్పటిదాకా వచ్చిన పాటలు, ప్రోమోలు హైప్ కి సరిపోయేలా ఉన్నాయి. వాటిని మరింత పెంచే బాధ్యతను ట్రయిలర్ తీసుకోబోతోంది. దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. హిందీ మార్కెట్ లోనూ దీనికి పబ్లిసిటీ వచ్చేలా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ బృందం ముంబై టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ విజయం మీద పూరి జగన్నాథ్ తర్వాతి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. తల్వార్ పేరుతో ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉందట. సాలిడ్ కంబ్యాక్ ఖచ్చితంగా చేస్తాననే నమ్మకం సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆగస్ట్ 15 దాకా వెయిట్ చేయాలి.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…