ఏదైనా మీడియా మైకు ముందు నోరు జారడం తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడానికి కిందా మీద పడటం కొందరు సీనియర్ నటులకు అలవాటుగా మారింది. ఆ మధ్య త్రిష మీద మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. తాజాగా తమన్నా మీద అలాంటి కామెంట్స్ చేసి పార్తీబన్ హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి ఆడియన్స్ కేవలం డాన్సు కోసమే సినిమా చూస్తున్నారని, తమన్నా ఉంటే చాలు బొమ్మ హిట్టయిపోతుందని అనేశారు. ఇది రజనీకాంత్ జైలర్ గురించేనని కొందరు భావించి సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.
ఇది దూరం వెళ్తోందని గుర్తించిన పార్తీబన్ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని, ఎవరినీ చులకన చేసే ఉద్దేశం తనకు లేదని సారీ చెప్పాడు. గతంలో ఇదే తమన్నా నటించిన రామ్ చరణ్ రచ్చలో ఈయన హీరో తండ్రిగా కాసేపు క్యామియో చేయడం గుర్తేగా. ఇటీవలే భారతీయుడు 2తో తన టీన్జ్ అనే పిల్లల హారర్ సినిమాని విడుదల చేశాడు పార్తీబన్. దానికంటే బెటర్ గా ఉందనే టాక్ వచ్చింది కానీ బాగుందనే మాట ప్రేక్షకుల నుంచి రాబట్టుకోలేదు. ఫెయిల్యూర్ గానే నిలిచింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తమన్నా పేరుని వాడటం, అది కాస్తా వైరల్ కావడం జరిగిపోయాయి.
ఆయన సంగతి కాసేపు పక్కనపెడితే తమన్నా స్పెషల్ సాంగ్స్ కు చాలా ప్లస్ అవుతోందన్న మాట వాస్తవమే. జైలర్ అనే కాదు గతంలో జై లవకుశ, సరిలేరు నీకెవ్వరుతో పాటు త్వరలో విడుదల కాబోయే బాలీవుడ్ మూవీ స్త్రీ 2లోనూ ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది. ఇది దృష్టిలో ఉంచుకునే పార్తీబన్ అలా అన్నారో ఏమో కానీ మొత్తానికి పెద్దాయన అలోచించి మాట్లాడాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తారని పేరున్న ఈ సీనియర్ మోస్ట్ నటుడు ఏదో ఫ్లోలో అనేసిన మాట దూరం వెళ్లిపోయింది. అందుకే ఇంటర్ నెట్ యుగంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…