ఏదైనా మీడియా మైకు ముందు నోరు జారడం తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడానికి కిందా మీద పడటం కొందరు సీనియర్ నటులకు అలవాటుగా మారింది. ఆ మధ్య త్రిష మీద మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. తాజాగా తమన్నా మీద అలాంటి కామెంట్స్ చేసి పార్తీబన్ హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి ఆడియన్స్ కేవలం డాన్సు కోసమే సినిమా చూస్తున్నారని, తమన్నా ఉంటే చాలు బొమ్మ హిట్టయిపోతుందని అనేశారు. ఇది రజనీకాంత్ జైలర్ గురించేనని కొందరు భావించి సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.
ఇది దూరం వెళ్తోందని గుర్తించిన పార్తీబన్ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని, ఎవరినీ చులకన చేసే ఉద్దేశం తనకు లేదని సారీ చెప్పాడు. గతంలో ఇదే తమన్నా నటించిన రామ్ చరణ్ రచ్చలో ఈయన హీరో తండ్రిగా కాసేపు క్యామియో చేయడం గుర్తేగా. ఇటీవలే భారతీయుడు 2తో తన టీన్జ్ అనే పిల్లల హారర్ సినిమాని విడుదల చేశాడు పార్తీబన్. దానికంటే బెటర్ గా ఉందనే టాక్ వచ్చింది కానీ బాగుందనే మాట ప్రేక్షకుల నుంచి రాబట్టుకోలేదు. ఫెయిల్యూర్ గానే నిలిచింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తమన్నా పేరుని వాడటం, అది కాస్తా వైరల్ కావడం జరిగిపోయాయి.
ఆయన సంగతి కాసేపు పక్కనపెడితే తమన్నా స్పెషల్ సాంగ్స్ కు చాలా ప్లస్ అవుతోందన్న మాట వాస్తవమే. జైలర్ అనే కాదు గతంలో జై లవకుశ, సరిలేరు నీకెవ్వరుతో పాటు త్వరలో విడుదల కాబోయే బాలీవుడ్ మూవీ స్త్రీ 2లోనూ ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది. ఇది దృష్టిలో ఉంచుకునే పార్తీబన్ అలా అన్నారో ఏమో కానీ మొత్తానికి పెద్దాయన అలోచించి మాట్లాడాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తారని పేరున్న ఈ సీనియర్ మోస్ట్ నటుడు ఏదో ఫ్లోలో అనేసిన మాట దూరం వెళ్లిపోయింది. అందుకే ఇంటర్ నెట్ యుగంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
This post was last modified on July 20, 2024 5:20 pm
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…