ఏదైనా మీడియా మైకు ముందు నోరు జారడం తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడానికి కిందా మీద పడటం కొందరు సీనియర్ నటులకు అలవాటుగా మారింది. ఆ మధ్య త్రిష మీద మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. తాజాగా తమన్నా మీద అలాంటి కామెంట్స్ చేసి పార్తీబన్ హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి ఆడియన్స్ కేవలం డాన్సు కోసమే సినిమా చూస్తున్నారని, తమన్నా ఉంటే చాలు బొమ్మ హిట్టయిపోతుందని అనేశారు. ఇది రజనీకాంత్ జైలర్ గురించేనని కొందరు భావించి సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.
ఇది దూరం వెళ్తోందని గుర్తించిన పార్తీబన్ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని, ఎవరినీ చులకన చేసే ఉద్దేశం తనకు లేదని సారీ చెప్పాడు. గతంలో ఇదే తమన్నా నటించిన రామ్ చరణ్ రచ్చలో ఈయన హీరో తండ్రిగా కాసేపు క్యామియో చేయడం గుర్తేగా. ఇటీవలే భారతీయుడు 2తో తన టీన్జ్ అనే పిల్లల హారర్ సినిమాని విడుదల చేశాడు పార్తీబన్. దానికంటే బెటర్ గా ఉందనే టాక్ వచ్చింది కానీ బాగుందనే మాట ప్రేక్షకుల నుంచి రాబట్టుకోలేదు. ఫెయిల్యూర్ గానే నిలిచింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తమన్నా పేరుని వాడటం, అది కాస్తా వైరల్ కావడం జరిగిపోయాయి.
ఆయన సంగతి కాసేపు పక్కనపెడితే తమన్నా స్పెషల్ సాంగ్స్ కు చాలా ప్లస్ అవుతోందన్న మాట వాస్తవమే. జైలర్ అనే కాదు గతంలో జై లవకుశ, సరిలేరు నీకెవ్వరుతో పాటు త్వరలో విడుదల కాబోయే బాలీవుడ్ మూవీ స్త్రీ 2లోనూ ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది. ఇది దృష్టిలో ఉంచుకునే పార్తీబన్ అలా అన్నారో ఏమో కానీ మొత్తానికి పెద్దాయన అలోచించి మాట్లాడాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తారని పేరున్న ఈ సీనియర్ మోస్ట్ నటుడు ఏదో ఫ్లోలో అనేసిన మాట దూరం వెళ్లిపోయింది. అందుకే ఇంటర్ నెట్ యుగంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
This post was last modified on July 20, 2024 5:20 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…