గత ఏడాది దసరా, హాయ్ నాన్న రూపంలో రెండు ఘనవిజయాలు సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని వచ్చే నెల ఆగస్ట్ 29న సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కథల ఎంపికలో విలక్షణ శైలి పాటిస్తూ క్లాసు, మాసుని బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్న నాని మరోసారి వివేక్ ఆత్రేయతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. వీళ్ళ కలయికలో వచ్చిన అంటే సుందరానికి కమర్షియల్ గా అద్భుతాలు చేయనప్పటికీ కంటెంట్ ప్రశంసలు దక్కించుకుంది. ఇవాళ విలన్ గా నటించిన ఎస్జె సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ టీజర్ ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ డివివి.
కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూని ఇందులో రివీల్ చేశారు. అనగనగా నరకాసురుడు లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ (ఎస్జె సూర్య). ఖాకీ దుస్తులు ధరించిన దుర్మార్గుడు. దొరికినవాడు అమాయకుడైనా సరే నరకం చూపించే దాకా వదిలిపెట్టడు. అధికారం మాటున అరాచకం చేస్తున్న ఇతన్ని అడ్డుకునేందుకు సూర్య (నాని) రూపంలో శ్రీకృష్ణుడు, కానిస్టేబుల్ వేషంలో సత్యభామ (ప్రియాంక మోహన్) లు రంగంలోకి దిగుతారు. రక్తం తాగే ఆ కరుడు గట్టిన కిరాతకుడిని సూర్య ఎలా ఎదురుకున్నాడు, అది కూడా ఒక్క శనివారం మాత్రమే కోపం వచ్చే తన లక్షణాన్ని ఎలా వాడుకున్నాడనేది తెరమీద చూడాలి.
టీజర్లు చూస్తుంటే వివేక్ ఆత్రేయ ఏదో ఊహించని డిఫరెంట్ పాయింట్ తోనే సరిపోదా శనివారం తెరకెక్కించి నట్టు కనిపిస్తోంది. మాస్ టచ్ చూపిస్తూనే స్టయిలిష్ యాక్షన్ ని జొప్పించి తీరు కొత్తగా అనిపిస్తోంది. నాని తనదైన టైమింగ్ తో ఎప్పటిలాగే అదరగొడతాడు కానీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కి దూరంగా చేసిన ఈ ప్రయత్నం అభిమనులకు చాలా స్పెషల్ గా ఉండిపోనుంది. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ థ్రిల్లర్ పెద్ద బడ్జెట్ తోనే రూపొందింది. ఫిలింఫేర్, సైమా అవార్డుల్లో ఆధిపత్యం ప్రదర్శించిన నాని మరోసారి అవార్డు విన్నింగ్ కంటెంట్ తోనే వస్తున్నాడు. చూద్దాం.
This post was last modified on July 20, 2024 11:39 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…