ప్రతి స్టార్ హీరోకూ అభిమానులే బలం. వారి గురించి వేదికల మీద గొప్పగా మాట్లాడుతుంటారు. ఐతే ఫ్యాన్స్ను పొగడ్డమే కాక వారి కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయినపుడు భీమవరంలో లక్షల మంది అభిమానులకు నాన్ వెజ్ బోజనం పెట్టిన ఘనత ప్రభాస్కే చెందుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికీ లేదనుకుండా ఆ రోజు భోజనం పెట్టించడం గురించి పెద్ద చర్చ జరిగింది.
ఇక ఎప్పుడూ ఫ్యాన్స్ గురించి గొప్పగా మాట్లాడే ప్రభాస్.. తాజాగా వాళ్లు లేకుంటే తాను జీరో అని పెద్ద కామెంట్ చేయడం విశేషం. తన కొత్త చిత్రం కల్కి 2898 ఏడీ బ్లాక్బస్టర్ సక్సెస్ అయి ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశం ఒక నోట్ రిలీజ్ చేశాడు.
అందులో తన అభిమానులకు బిగ్ థ్యాంక్స్ చెబుతూ మీరు లేకుంటే నేను జీరో అన్నాడు ప్రభాస్. అభిమానులను అందరూ కొనియాడేవారే కానీ.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఫ్యాన్స్ లేకుంటే తాను జీరో అని చెప్పడం మాత్రం విశేషం.
ఇక కల్కి మూవీ కోసం ఐదేళ్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత కష్టపడ్డాడో వివరిస్తూ తనకంటే చిన్నవాడు, సినిమాల్లో జూనియర్ అయిన నాగిని గారు అని సంబోధిస్తూ మాట్లాడాడు ప్రభాస్. ఇంత పెద్ద సినిమాను ఏమాత్రం రాజీ పడకుండా నిర్మించిన వైజయంతీ మూవీస్కు కూడా కృతజ్ఞతలు చెప్పాడు ప్రభాస్. బడ్జెట్, కాస్టింగ్ విషయంలో కొన్నిసార్లు రాజీ పడదాం అని తాము అన్నా నిర్మాతలు వెనుకంజ వేయలేదన్నాడు. చిన్నప్పట్నుంచి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల సినిమాలు చూసి పెరిగిన తాను వాళ్లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి అన్నాడు ప్రభాస్. అలాగే గార్జియస్ బ్యూటీ అంటూ కథానాయిక దీపికా పదుకొనే మీద కూడా ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు.
This post was last modified on July 15, 2024 6:07 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…