Movie News

దేవిశ్రీప్రసాద్ మొదటిసారి ఇండియా లైవ్

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు కానీ సరైన దర్శకుడు, ఆల్బమ్ పడితే దుమ్ము దులుపుతాడనే సంగతి తెలిసిందే. పుష్ప 2 ది రూల్ నుంచి రెండు ఆడియో సింగల్స్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. పాతికేళ్లకు పైగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న దేవి టాలీవుడ్ లో చిరంజీవితో మొదలుకుని మహేష్ బాబు దాకా ప్రతి అగ్ర హీరోకి మర్చిపోలేని పాటలిచ్చాడు. విదేశాల్లో చెప్పుకోదగ్గ లైవ్ షోలు చేసిన డిఎస్పి ఇప్పటిదాకా ఇండియాలో లైవ్ కన్సర్ట్ చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది నిజం. అభిమానులు ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది.

మొట్టమొదటిసారి దేవిశ్రీప్రసాద్ ఇండియా టూర్ చేయబోతున్నాడు. అందులో భాగంగా అక్టోబర్ 19 హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యక్షంగా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నాడు. టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టారు. 999 రూపాయలతో మొదలుపెట్టి 24999 రూపాయల దాకా అన్ని వర్గాల అభిమానులకు తగట్టు ధరలు నిర్ణయించారు. సమయం, నిడివి తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఓవర్సీస్ లో ఇలాంటి ప్రోగ్రాంస్ గతంలో దేవి చాలానే చేశాడు. అన్నీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకున్నవే. కాకపోతే ఏపీ, తెలంగాణలో ఇప్పటిదాకా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.

నిజం చెప్పాలంటే దేవి ఎప్పుడో ఇలాంటివి చేసుకుండాల్సింది. ఇళయరాజా గత పదేళ్లలో మూడుసార్లు భాగ్యనగరంలో లైవ్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ ది అయ్యింది. త్వరలో యువన్ శంకర్ రాజా రాబోతున్నాడు. హరీష్ జైరాజ్ ది ప్లానింగ్ లో ఉంది. మరి ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ లో భాగమైన దేవి ఇంత లేట్ గా ఇక్కడ షో చేయడం గమనార్హం. పుష్ప 2 ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, తండేల్ లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ తో ఇంత పోటీలోనూ బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ నుంచి క్లాసిక్ సాంగ్స్ ని ప్రత్యక్షంగా చూస్తూ వినే అవకాశాన్ని ఫ్యాన్స్ ఏ మేరకు అందిపుచ్చుకుంటారో చూడాలి.

This post was last modified on July 15, 2024 5:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

36 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

6 hours ago