తెలుగు ప్రేక్షకుల సినిమా అభిమానం గురించి వేరే భాషలకు చెందిన వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. ఇప్పుడు మన వాళ్ల అభిమానం మరోసారి చర్చనీయాంశం అయ్యేలా ఉంది. నిన్న రిలీజైన కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్-2’కు ఇండియా మొత్తంలో అత్యధిక డే-1 వసూళ్లు తెలుగు నుంచే వచ్చాయన్నది ట్రేడ్ వర్గాలను షాక్కు గురి చేస్తున్న అంశం.
కమల్ హాసన్ తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరు. శంకర్ అక్కడి లెజెండరీ డైరెక్టర్లలో ఒకడు. ఈ కాంబినేషన్కు ఆటోమేటిగ్గా తమిళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండాలి. పైగా వాళ్లిద్దరూ కలిసి చేసింది ‘ఇండియన్’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్కు సీక్వెల్. కానీ రకరకాల కారణాల వల్ల ఈ చిత్రానికి విడుదల ముంగిట ఆశించిన హైప్ లేకపోయింది. తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా జరిగాయి. తెలుగులో కూడా బజ్ తక్కువే కానీ.. తమిళంతో పోలిస్తే తెలుగులోనే మెరుగ్గా ప్రి సేల్స్ జరిగాయి.
తొలి రోజు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్ఫుల్స్తో మొదలైంది ‘భారతీయుడు-2’. టాక్ మరీ బ్యాడ్గా ఉన్నప్పటికీ తొలి రోజు ఓపెనింగ్స్ మీద పెద్దగా ప్రభావం పడనట్లే ఉంది. పది కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూళ్లు ఉంటాయని అంచనా. షేర్ రూ.6-7 కోట్ల మధ్య ఉండొచ్చు. ఐతే తమిళంలో తొలి రోజు ‘ఇండియన్-2’ వసూళ్లు పది కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేలా లేవు. తెలుగుతో పోలిస్తే తమిళంలో టాక్ బెటర్గా ఉన్నప్పటికీ తొలి రోజు వసూళ్లలో అది ప్రతిబింబించేలా లేదు.
తమిళనాట థియేటర్లు తక్కువ కావడం.. తెలుగుతో పోలిస్తే టికెట్ల ధరలు తక్కువ ఉండడం కూడా ఇక్కడితో పోలిస్తే అక్కడ కలెక్షన్లు తక్కువగా ఉండడం కారణమే కానీ.. ఎలా చూసినా సరే ఇలాంటి భారీ చిత్రానికి తమిళంతో పోలిస్తే తెలుగులో వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటే అది ట్రేడ్ వర్గాలకు షాకిచ్చే విషయమే. దీంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ చర్చనీయాంశంగా మారుతోంది.
This post was last modified on July 14, 2024 9:59 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…