తెలుగు ప్రేక్షకుల సినిమా అభిమానం గురించి వేరే భాషలకు చెందిన వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. ఇప్పుడు మన వాళ్ల అభిమానం మరోసారి చర్చనీయాంశం అయ్యేలా ఉంది. నిన్న రిలీజైన కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్-2’కు ఇండియా మొత్తంలో అత్యధిక డే-1 వసూళ్లు తెలుగు నుంచే వచ్చాయన్నది ట్రేడ్ వర్గాలను షాక్కు గురి చేస్తున్న అంశం.
కమల్ హాసన్ తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరు. శంకర్ అక్కడి లెజెండరీ డైరెక్టర్లలో ఒకడు. ఈ కాంబినేషన్కు ఆటోమేటిగ్గా తమిళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండాలి. పైగా వాళ్లిద్దరూ కలిసి చేసింది ‘ఇండియన్’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్కు సీక్వెల్. కానీ రకరకాల కారణాల వల్ల ఈ చిత్రానికి విడుదల ముంగిట ఆశించిన హైప్ లేకపోయింది. తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా జరిగాయి. తెలుగులో కూడా బజ్ తక్కువే కానీ.. తమిళంతో పోలిస్తే తెలుగులోనే మెరుగ్గా ప్రి సేల్స్ జరిగాయి.
తొలి రోజు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్ఫుల్స్తో మొదలైంది ‘భారతీయుడు-2’. టాక్ మరీ బ్యాడ్గా ఉన్నప్పటికీ తొలి రోజు ఓపెనింగ్స్ మీద పెద్దగా ప్రభావం పడనట్లే ఉంది. పది కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూళ్లు ఉంటాయని అంచనా. షేర్ రూ.6-7 కోట్ల మధ్య ఉండొచ్చు. ఐతే తమిళంలో తొలి రోజు ‘ఇండియన్-2’ వసూళ్లు పది కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసేలా లేవు. తెలుగుతో పోలిస్తే తమిళంలో టాక్ బెటర్గా ఉన్నప్పటికీ తొలి రోజు వసూళ్లలో అది ప్రతిబింబించేలా లేదు.
తమిళనాట థియేటర్లు తక్కువ కావడం.. తెలుగుతో పోలిస్తే టికెట్ల ధరలు తక్కువ ఉండడం కూడా ఇక్కడితో పోలిస్తే అక్కడ కలెక్షన్లు తక్కువగా ఉండడం కారణమే కానీ.. ఎలా చూసినా సరే ఇలాంటి భారీ చిత్రానికి తమిళంతో పోలిస్తే తెలుగులో వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటే అది ట్రేడ్ వర్గాలకు షాకిచ్చే విషయమే. దీంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ చర్చనీయాంశంగా మారుతోంది.
This post was last modified on July 14, 2024 9:59 am
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…