నిన్న విడుదలైన భారతీయుడు 2కి వచ్చిన టాక్ చూసి పరిశ్రమే కాదు ప్రేక్షక లోకం సైతం ఆశ్చర్యపోయింది. కల్ట్ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఒరిజినల్ వెర్షన్ తమిళంలోనూ ఆశించిన స్పందన రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉన్నంతలో ఏపీ తెలంగాణలోనే మెరుగైన వసూళ్లు నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అందరి వేళ్ళు దర్శకుడు శంకర్ వైపు వెళ్తున్నాయి. ఐ నుంచి ఇండియన్ 2 దాకా ఆయన ముద్ర కనిపించడం లేదని, ఒకప్పటి వెటరన్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని అంటున్నాయి.
ఇక్కడ రాజమౌళి ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందో చూద్దాం. జక్కన్న ప్రాధమికంగా కథకుడు కాదు. స్టోరీలు రాయడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సబ్జెక్టుని తీసుకుని తన టీమ్ తో ఒక వెర్షన్ ని తయారు చేయించి దాన్ని తెరమీదకు ఎలా ఎక్కిస్తే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారో అలాంటి బ్లాక్స్, ఎమోషన్స్ డిజైన్ చేసుకుంటారు. శంకర్ కు ఒకప్పుడు సుజాత (మునుపటి పేరు ఎస్ రంగరాజన్) ఉండేవారు. రోబో షూటింగ్ సమయంలో ఆయన చనిపోయాక ఒక్కసారిగా శంకర్ బృందంలో కుదుపు వచ్చేసింది. తండ్రి లాంటి ఆయన కలం లేని లోటు ఎవరూ తీర్చలేకపోయారు.
ఇక అక్కడ నుంచి శంకర్ మార్క్ మిస్ అవ్వడం మొదలైంది. జెంటిల్ మెన్ నుంచి ఈ ఇద్దరి ప్రయాణం అమోఘంగా సాగింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లను నభూతో అనిపించేలా డిజైన్ చేయడంలో సుజాతది అందెవేసిన చెయ్యి. వందకు పైగా నవలలు రాసిన అనుభవం, ఇంజనీరింగ్ తో సహా వివిధ వృత్తుల్లో రాటుదేలిన వైనం ఆయన్ని మాస్టర్ రైటర్ గా మార్చాయి. సుజాత కాలం చేశాక శంకర్ మళ్ళీ మరో రీ ప్లేస్ మెంట్ చేసుకోలేకపోయారు. రాజమౌళి బలం విజయేంద్ర గారైతే శంకర్ కు అలాంటి ఆయుధంగా ఉన్న సుజాత రంగరాజన్ లేకపోవడం ముమ్మాటికీ తీరని నష్టం.
This post was last modified on July 13, 2024 11:25 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…