నిన్న విడుదలైన భారతీయుడు 2కి వచ్చిన టాక్ చూసి పరిశ్రమే కాదు ప్రేక్షక లోకం సైతం ఆశ్చర్యపోయింది. కల్ట్ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఒరిజినల్ వెర్షన్ తమిళంలోనూ ఆశించిన స్పందన రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉన్నంతలో ఏపీ తెలంగాణలోనే మెరుగైన వసూళ్లు నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అందరి వేళ్ళు దర్శకుడు శంకర్ వైపు వెళ్తున్నాయి. ఐ నుంచి ఇండియన్ 2 దాకా ఆయన ముద్ర కనిపించడం లేదని, ఒకప్పటి వెటరన్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని అంటున్నాయి.
ఇక్కడ రాజమౌళి ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందో చూద్దాం. జక్కన్న ప్రాధమికంగా కథకుడు కాదు. స్టోరీలు రాయడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సబ్జెక్టుని తీసుకుని తన టీమ్ తో ఒక వెర్షన్ ని తయారు చేయించి దాన్ని తెరమీదకు ఎలా ఎక్కిస్తే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారో అలాంటి బ్లాక్స్, ఎమోషన్స్ డిజైన్ చేసుకుంటారు. శంకర్ కు ఒకప్పుడు సుజాత (మునుపటి పేరు ఎస్ రంగరాజన్) ఉండేవారు. రోబో షూటింగ్ సమయంలో ఆయన చనిపోయాక ఒక్కసారిగా శంకర్ బృందంలో కుదుపు వచ్చేసింది. తండ్రి లాంటి ఆయన కలం లేని లోటు ఎవరూ తీర్చలేకపోయారు.
ఇక అక్కడ నుంచి శంకర్ మార్క్ మిస్ అవ్వడం మొదలైంది. జెంటిల్ మెన్ నుంచి ఈ ఇద్దరి ప్రయాణం అమోఘంగా సాగింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లను నభూతో అనిపించేలా డిజైన్ చేయడంలో సుజాతది అందెవేసిన చెయ్యి. వందకు పైగా నవలలు రాసిన అనుభవం, ఇంజనీరింగ్ తో సహా వివిధ వృత్తుల్లో రాటుదేలిన వైనం ఆయన్ని మాస్టర్ రైటర్ గా మార్చాయి. సుజాత కాలం చేశాక శంకర్ మళ్ళీ మరో రీ ప్లేస్ మెంట్ చేసుకోలేకపోయారు. రాజమౌళి బలం విజయేంద్ర గారైతే శంకర్ కు అలాంటి ఆయుధంగా ఉన్న సుజాత రంగరాజన్ లేకపోవడం ముమ్మాటికీ తీరని నష్టం.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…