నిన్న విడుదలైన భారతీయుడు 2కి వచ్చిన టాక్ చూసి పరిశ్రమే కాదు ప్రేక్షక లోకం సైతం ఆశ్చర్యపోయింది. కల్ట్ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఒరిజినల్ వెర్షన్ తమిళంలోనూ ఆశించిన స్పందన రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉన్నంతలో ఏపీ తెలంగాణలోనే మెరుగైన వసూళ్లు నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అందరి వేళ్ళు దర్శకుడు శంకర్ వైపు వెళ్తున్నాయి. ఐ నుంచి ఇండియన్ 2 దాకా ఆయన ముద్ర కనిపించడం లేదని, ఒకప్పటి వెటరన్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని అంటున్నాయి.
ఇక్కడ రాజమౌళి ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందో చూద్దాం. జక్కన్న ప్రాధమికంగా కథకుడు కాదు. స్టోరీలు రాయడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సబ్జెక్టుని తీసుకుని తన టీమ్ తో ఒక వెర్షన్ ని తయారు చేయించి దాన్ని తెరమీదకు ఎలా ఎక్కిస్తే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారో అలాంటి బ్లాక్స్, ఎమోషన్స్ డిజైన్ చేసుకుంటారు. శంకర్ కు ఒకప్పుడు సుజాత (మునుపటి పేరు ఎస్ రంగరాజన్) ఉండేవారు. రోబో షూటింగ్ సమయంలో ఆయన చనిపోయాక ఒక్కసారిగా శంకర్ బృందంలో కుదుపు వచ్చేసింది. తండ్రి లాంటి ఆయన కలం లేని లోటు ఎవరూ తీర్చలేకపోయారు.
ఇక అక్కడ నుంచి శంకర్ మార్క్ మిస్ అవ్వడం మొదలైంది. జెంటిల్ మెన్ నుంచి ఈ ఇద్దరి ప్రయాణం అమోఘంగా సాగింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లను నభూతో అనిపించేలా డిజైన్ చేయడంలో సుజాతది అందెవేసిన చెయ్యి. వందకు పైగా నవలలు రాసిన అనుభవం, ఇంజనీరింగ్ తో సహా వివిధ వృత్తుల్లో రాటుదేలిన వైనం ఆయన్ని మాస్టర్ రైటర్ గా మార్చాయి. సుజాత కాలం చేశాక శంకర్ మళ్ళీ మరో రీ ప్లేస్ మెంట్ చేసుకోలేకపోయారు. రాజమౌళి బలం విజయేంద్ర గారైతే శంకర్ కు అలాంటి ఆయుధంగా ఉన్న సుజాత రంగరాజన్ లేకపోవడం ముమ్మాటికీ తీరని నష్టం.
This post was last modified on July 13, 2024 11:25 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…