ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న తమిళ అనువాద చిత్రం ‘భారతీయుడు-2’కు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం చర్చనీయాంశం అవుతోంది. కమల్ హాసన్, శంకర్లకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ‘భారతీయుడు’ లాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ కాబట్టి ‘భారతీయుడు-2’ మీద ప్రేక్షకుల్లో అంచనాలుంటాయన్నది వాస్తవం. కానీ ఎంతైనా ఇది ఒక డబ్బింగ్ మూవీ అనే విషయం మరిచిపోకూడదు.
తెలుగు సినిమా కాదు. పర భాష నుంచి వచ్చిన చిత్రానికి కూడా రేట్లు పెంచాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పాయింట్. ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ఇండియన్-2 ఒరిజినల్గా తెరకెక్కింది తమిళంలో అయితే.. తమిళనాట ఆ సినిమాకు పెట్టిన రేట్లతో పోలిస్తే తెలంగాణలో 80 శాతం అధిక ధరలు ఉన్నాయి.
తమిళనాట మల్టీప్లెక్సుల్లో కూడా టికెట్ ధర రూ.190 మాత్రమే. నార్మల్ సింగిల్ స్క్రీన్లలో రేటు రూ.150. ప్రీమియం సింగిల్ స్క్రీన్లలో మల్టీప్లెక్సులతో సమానంగా ధర ఉంది. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాదిరి పెద్ద సినిమాలకు రేటు పెంచుకునే సంప్రదాయం లేదు. నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేస్తారు. ‘ఇండియన్-2’ భారీ బడ్జెట్ మూవీ అయినా రూ.190, రూ.150 రేట్లతోనే రిలీజవుతోంది. కానీ తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో రూ.350, సింగిల్ స్క్రీన్లలో రూ.225 రేటుతో చూడాల్సిన పరిస్థితి.
మామూలుగానే ఇక్కడ తమిళనాడుతో పోలిస్తే రేట్లు ఎక్కువ. మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో 175 పెట్టాలి. అవే ఎక్కువ రేట్లు అంటే.. వాటి మీద అదనపు రేట్లు ఇచ్చారు. ఒక తమిళ సినిమాను తమిళులు రూ.200 లోపు రేటుతో చూస్తుంటే మనం మాత్రం రూ.350 పెట్టాల్సి రావడం విడ్డూరం. మన ప్రేక్షకుల సినిమా పిచ్చిన క్యాష్ చేసుకోవడం కాక ఇది మరేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on July 11, 2024 6:21 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…