ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న తమిళ అనువాద చిత్రం ‘భారతీయుడు-2’కు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం చర్చనీయాంశం అవుతోంది. కమల్ హాసన్, శంకర్లకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ‘భారతీయుడు’ లాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ కాబట్టి ‘భారతీయుడు-2’ మీద ప్రేక్షకుల్లో అంచనాలుంటాయన్నది వాస్తవం. కానీ ఎంతైనా ఇది ఒక డబ్బింగ్ మూవీ అనే విషయం మరిచిపోకూడదు.
తెలుగు సినిమా కాదు. పర భాష నుంచి వచ్చిన చిత్రానికి కూడా రేట్లు పెంచాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పాయింట్. ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ఇండియన్-2 ఒరిజినల్గా తెరకెక్కింది తమిళంలో అయితే.. తమిళనాట ఆ సినిమాకు పెట్టిన రేట్లతో పోలిస్తే తెలంగాణలో 80 శాతం అధిక ధరలు ఉన్నాయి.
తమిళనాట మల్టీప్లెక్సుల్లో కూడా టికెట్ ధర రూ.190 మాత్రమే. నార్మల్ సింగిల్ స్క్రీన్లలో రేటు రూ.150. ప్రీమియం సింగిల్ స్క్రీన్లలో మల్టీప్లెక్సులతో సమానంగా ధర ఉంది. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాదిరి పెద్ద సినిమాలకు రేటు పెంచుకునే సంప్రదాయం లేదు. నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేస్తారు. ‘ఇండియన్-2’ భారీ బడ్జెట్ మూవీ అయినా రూ.190, రూ.150 రేట్లతోనే రిలీజవుతోంది. కానీ తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో రూ.350, సింగిల్ స్క్రీన్లలో రూ.225 రేటుతో చూడాల్సిన పరిస్థితి.
మామూలుగానే ఇక్కడ తమిళనాడుతో పోలిస్తే రేట్లు ఎక్కువ. మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో 175 పెట్టాలి. అవే ఎక్కువ రేట్లు అంటే.. వాటి మీద అదనపు రేట్లు ఇచ్చారు. ఒక తమిళ సినిమాను తమిళులు రూ.200 లోపు రేటుతో చూస్తుంటే మనం మాత్రం రూ.350 పెట్టాల్సి రావడం విడ్డూరం. మన ప్రేక్షకుల సినిమా పిచ్చిన క్యాష్ చేసుకోవడం కాక ఇది మరేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on July 11, 2024 6:21 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…