పవన్ కళ్యాణ్ తన సోల్ మేట్ అంటూ ఒకప్పుడు పవర్ స్టార్ గురించి సందర్భం వచ్చినపుడల్లా గొప్పగా మాట్లాడేవాడు స్టార్ రైటర్ కోన వెంకట్. ఇలా పవన్ తనకు ఆప్త మిత్రుడని చెప్పుకోవడం ద్వారా పవర్ స్టార్ అభిమానుల్లో కూడా ఆదరణ దక్కించుకున్నాడు. కానీ 2019 ఎన్నికల ముంగిట పవన్ ఫ్యాన్స్కు పెద్ద షాకిస్తూ వైసీపీలో చేరడమే కాదు.. పవన్ మీద తీవ్ర విమర్శలు చేయడం ద్వారా వారికి పెద్ద శత్రువుగా మారిపోయాడు. సోల్ మేట్ అని చెప్పుకుంటూ ఇలా యుటర్న్ తీసుకోవడం.. పైగా పవన్ మీద తీవ్ర విమర్శలు చేయడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో అప్పట్నుంచి కోనను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవలి ఎన్నికల ముంగిట వైసీపీ ప్రభుత్వానికి ఎలివేషన్ ట్వీట్లు వేస్తే పవన్ ఫ్యాన్సే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా కోనకు మామూలుగా రిప్లైలు ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ కనిపించకపోవడంతోనే కోనకు పరిస్థితి అర్థమైపోయి ఉండాలి.
ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. ఐతే ఫలితాలు రాగానే కోన మళ్లీ యుటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తున్నాడు. పవన్ గురించి వరుసగా పాజిటివ్గా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఐతే గెలిచినపుడు మొక్కుబడిగా ఒక ట్వీట్ వేయడం ఓకే కానీ.. వరుసగా జనసేనానికి ఎలివేషన్లు ఇస్తుండడం గమనార్హం. పవన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇది చాలా ముఖ్యమైన రోజని, దీని కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశాడు కోన.
తాజాగా పవన్ మంత్రిగా చేసిన మంచి పనులను కొనియాడుతూ ట్వీట్ వేశాడు. చేతి వృత్తులకు పవన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసించాడు. ఆ ట్వీట్లలో పవన్ను కొనియాడుతున్న తీరు చూస్తుంటే వైసీపీకి ఆయన టాటా చెప్పేసి మళ్లీ పవన్ భక్తుడిగా మారిపోయాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కానీ జనసైనికులు మాత్రం ఇప్పుడిప్పుడే కోనను మన్నించేలా లేరు. వారి ఆగ్రహం ఆ స్థాయిలో ఉంది కాబట్టే.. కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకుని ట్వీట్లు వేస్తున్నాడు కోన. తాను పూర్తిగా మారిపోయానని పవన్ ఫ్యాన్స్ భావించి తన మీద దాడి ఆపితే తప్ప ఆయన కామెంట్ బాక్స్ ఓపెన్ చేసేలా లేరు.
This post was last modified on July 10, 2024 3:23 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…