ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో షో ఆరంభానికి ముందు వ్యతిరేకత కనిపించింది. షో మొదలయ్యాక కూడా అదే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కరోనా వల్ల అన్ని రకాల వినోదాలకూ దూరమైన జనాలు.. ఈ షోను విరగబడి చూస్తున్నారని దాని రేటింగ్స్ చూస్తే అర్థమైంది. గత మూడు సీజన్ల రికార్డులను బద్దలు కొట్టే టీఆర్పీలు వస్తున్నాయి షోకు. ఇక హౌస్ లోపలి వ్యవహారాలు మరీ ఎగ్జైటింగ్గా ఏమీ లేకపోయినా.. ఆదరణకు ఏమీ లోటు లేదు.
ఈసారి షో రెండు వారాలు అయ్యేసరికే ఇద్దరు కొత్త కంటెస్టంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి వారం సూర్య కిరణ్ నిష్క్రమించగా.. అతడి స్థానంలో కమెడియన్ సాయి వచ్చాడు. రెండో వారం ఎలిమినేషన్కు ముందే జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు హౌస్లోకి మూడో కొత్త వ్యక్తి రాబోతోంది. ఐతే ఈసారి హౌస్లోకి రాబోయేది అబ్బాయి కాదు.. అమ్మాయి. హౌస్లో గ్లామర్ డోస్ మరింత పెంచే ఉద్దేశంతో ఒక హాట్ హీరోయిన్ని షోలోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆ అమ్మాయి పేరు.. స్వాతి దీక్షిత్. ‘లేడీస్ అండ్ జెంటిల్మన్’, ‘జంప్ జిలానీ’ లాంటి సినిమాల్లో హాట్ హాట్గా కనిపించిందీ అమ్మాయి. వీటితో పాటు బ్రేకప్, చిత్రాంగత తదితర చిత్రాల్లో నటించిందామె.
తమిళం, బెంగాలీల్లోనూ సినిమాలు చేసిన సాక్షి ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంది. ఇలాంటి టైంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఓకే అన్నట్లుంది. ఇప్పటికే మోనాల్, దివి, హారిక, సుజాత, అరియానా లాంటి అమ్మాయిలతో ‘బిగ్ బాస్’లో గ్లామర్కు లోటు లేదు. ఇప్పుడు స్వాతి సైతం రావడంతో కుర్రాళ్లు షో పట్ల మరింత ఆకర్షితులయ్యే అవకాశముంది. కాగా ఈ వారం టీవీ9 దేవి, సాయి, అరియానా తదితరులు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు.
This post was last modified on September 24, 2020 12:49 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…