బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ గొప్ప జాతీయ భావాలున్న వ్యక్తిలాగా కనిపిస్తుంటాడు. ‘సత్యమేవ జయతే’ లాంటి మంచి కార్యక్రమంలో తనలోని సామాజిక స్పృహను కూడా చాటుకున్నాడతను. కానీ ఇది ఆమిర్లోని ఒక కోణమే. అతడిలో మరో కోణం ఉంది. అప్పుడప్పుడూ ఆమిర్ మాటలు, చర్యలు అనేక సందేహాలకు తావిస్తుంటాయి.
ఇండియాలో ‘అసహనం’ పెరిగిపోతోందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామా అందని కొన్నేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఆమిర్ లాంటి సెలబ్రెటీకి వచ్చిన కష్టం ఏంటో చెప్పాలంటూ అప్పట్లో తటస్థులు కూడా మండిపడ్డారు. కాగా ఇటీవల తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఆమిర్ చిత్ర బృందంతో కలిసి టర్కీకి వెళ్లాడు. అక్కడ టర్కీ ప్రధాని బినాలి యిల్దిరిమ్ భార్య, టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్దోగన్ను కలిశాడు.
టర్కీ ప్రధాని పలుమార్లు ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. విషం కక్కాడు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చాడు. గత ఏడాది ఐక్య రాజ్య సమితిలో కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించిన భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా తెలిసి కూడా ఆమిర్ ఈ మధ్య టర్కీ అధ్యక్షుడి భార్యను కలిశాడు. కనీసం ఆ సందర్భంగా ఆ దేశంలో భారత దౌత్య కార్యాలయానికి సమాచారం కూడా ఇవ్వలేదు. కాగా ఇప్పుడు టర్కీ ప్రధాని మరోసారి భారత్ను ఇబ్బంది పెట్టే పని చేశాడు.
తాజాగా ఐరాస సర్వప్రతినిధి సభ వార్షికోత్సవ సమావేశంలో వీడియో సందేశం వినిపిస్తూ కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తాడు. భారత్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఇలాంటి వ్యక్తితో ఆమిర్ సంబంధాల కోసం ప్రయత్నించడం మరోసారి అతడికి ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. టర్కీ అధ్యక్షుడి తీరును ఖండించాలని, ఆయన భార్యను కలిసినందుకు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
This post was last modified on September 24, 2020 12:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…