బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ గొప్ప జాతీయ భావాలున్న వ్యక్తిలాగా కనిపిస్తుంటాడు. ‘సత్యమేవ జయతే’ లాంటి మంచి కార్యక్రమంలో తనలోని సామాజిక స్పృహను కూడా చాటుకున్నాడతను. కానీ ఇది ఆమిర్లోని ఒక కోణమే. అతడిలో మరో కోణం ఉంది. అప్పుడప్పుడూ ఆమిర్ మాటలు, చర్యలు అనేక సందేహాలకు తావిస్తుంటాయి.
ఇండియాలో ‘అసహనం’ పెరిగిపోతోందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామా అందని కొన్నేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఆమిర్ లాంటి సెలబ్రెటీకి వచ్చిన కష్టం ఏంటో చెప్పాలంటూ అప్పట్లో తటస్థులు కూడా మండిపడ్డారు. కాగా ఇటీవల తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఆమిర్ చిత్ర బృందంతో కలిసి టర్కీకి వెళ్లాడు. అక్కడ టర్కీ ప్రధాని బినాలి యిల్దిరిమ్ భార్య, టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్దోగన్ను కలిశాడు.
టర్కీ ప్రధాని పలుమార్లు ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. విషం కక్కాడు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చాడు. గత ఏడాది ఐక్య రాజ్య సమితిలో కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించిన భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా తెలిసి కూడా ఆమిర్ ఈ మధ్య టర్కీ అధ్యక్షుడి భార్యను కలిశాడు. కనీసం ఆ సందర్భంగా ఆ దేశంలో భారత దౌత్య కార్యాలయానికి సమాచారం కూడా ఇవ్వలేదు. కాగా ఇప్పుడు టర్కీ ప్రధాని మరోసారి భారత్ను ఇబ్బంది పెట్టే పని చేశాడు.
తాజాగా ఐరాస సర్వప్రతినిధి సభ వార్షికోత్సవ సమావేశంలో వీడియో సందేశం వినిపిస్తూ కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తాడు. భారత్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఇలాంటి వ్యక్తితో ఆమిర్ సంబంధాల కోసం ప్రయత్నించడం మరోసారి అతడికి ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. టర్కీ అధ్యక్షుడి తీరును ఖండించాలని, ఆయన భార్యను కలిసినందుకు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
This post was last modified on September 24, 2020 12:18 pm
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…
విశ్వంభర షూటింగ్ తప్ప వేరే ప్రపంచం లేకుండా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా…