Movie News

అశ్వినీదత్ చెప్పిన ‘నాగి చెప్పుల కథ’

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. బయట ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో తెలిసిందే. సింపుల్‌గా ఒక టీషర్ట్, కార్గో జీన్స్ వేసుకుని.. మామూలు స్లిప్పర్స్ ధరించి బయటికి వచ్చేస్తుంటాడు. ఆ మాటకొస్తే సినిమా సెట్లో, ఏదైనా ఈవెంట్లో కూడా అతను అలాంటి సింపుల్ వస్త్రధారణతోనే కనిపిస్తాడు. ‘కల్కి’ సినిమా తీసినన్ని రోజులు అతను ఒకే స్లిప్పర్స్ పెయిర్ ధరించడం విశేషం. సినిమా రిలీజైనపుడు పాడైపోయిన స్థితిలో ఉన్న స్లిప్పర్స్ ఫొటోలను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

నాగికి అమ్మాయినిచ్చిన మామ, ‘కల్కి’కి నిర్మాత కూడా అయిన అశ్వినీదత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగి సింప్లిసిటీ గురించి మాట్లాడాడు. ‘వైజయంతీ మూవీస్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. దీని ప్రోమోలో నాగి సింప్లిసిటీ గురించి దత్ మాట్లాడారు.

“జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి కానీ.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. తన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అతను మా ఇంటికి హడావుడిగా వస్తాడు. స్లిప్పర్స్ బయట విడిచి లోపలికి వస్తాడు. వెళ్లేటపుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే.. వచ్చేటపుడు కూడా వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు” అంటూ నాగి గురించి సరదా విషయాలు చెప్పుకొచ్చారు దత్. పూర్తి ఇంటర్వ్యూలో నాగి గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లే ఉన్నారు దత్.

ఇక ‘కల్కి’ సినిమాను రెండు భాగాలుగా తీయడం గురించి దత్ మాట్లాడుతూ.. కథా చర్చల సమయంలోనే రెండు భాగాలుగా చేయడం గురించి మాట్లాడుకున్నామని.. ఐతే కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాక 2 పార్ట్స్‌గా తీస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందని ఫిక్సయ్యామని దత్ చెప్పారు.

This post was last modified on July 9, 2024 7:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago