ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. బయట ఎంత సింపుల్గా కనిపిస్తాడో తెలిసిందే. సింపుల్గా ఒక టీషర్ట్, కార్గో జీన్స్ వేసుకుని.. మామూలు స్లిప్పర్స్ ధరించి బయటికి వచ్చేస్తుంటాడు. ఆ మాటకొస్తే సినిమా సెట్లో, ఏదైనా ఈవెంట్లో కూడా అతను అలాంటి సింపుల్ వస్త్రధారణతోనే కనిపిస్తాడు. ‘కల్కి’ సినిమా తీసినన్ని రోజులు అతను ఒకే స్లిప్పర్స్ పెయిర్ ధరించడం విశేషం. సినిమా రిలీజైనపుడు పాడైపోయిన స్థితిలో ఉన్న స్లిప్పర్స్ ఫొటోలను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
నాగికి అమ్మాయినిచ్చిన మామ, ‘కల్కి’కి నిర్మాత కూడా అయిన అశ్వినీదత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగి సింప్లిసిటీ గురించి మాట్లాడాడు. ‘వైజయంతీ మూవీస్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. దీని ప్రోమోలో నాగి సింప్లిసిటీ గురించి దత్ మాట్లాడారు.
“జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి కానీ.. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. తన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అతను మా ఇంటికి హడావుడిగా వస్తాడు. స్లిప్పర్స్ బయట విడిచి లోపలికి వస్తాడు. వెళ్లేటపుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. ఆశ్చర్యం ఏంటంటే.. వచ్చేటపుడు కూడా వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు” అంటూ నాగి గురించి సరదా విషయాలు చెప్పుకొచ్చారు దత్. పూర్తి ఇంటర్వ్యూలో నాగి గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లే ఉన్నారు దత్.
ఇక ‘కల్కి’ సినిమాను రెండు భాగాలుగా తీయడం గురించి దత్ మాట్లాడుతూ.. కథా చర్చల సమయంలోనే రెండు భాగాలుగా చేయడం గురించి మాట్లాడుకున్నామని.. ఐతే కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాక 2 పార్ట్స్గా తీస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందని ఫిక్సయ్యామని దత్ చెప్పారు.
This post was last modified on July 9, 2024 7:13 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…