కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీలోనూ ఎంతో గౌరవం ఉంది. నలభై సంవత్సరాలకు పైగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ కాలినడకన, ఆటోలో వెళ్లే పీపుల్స్ స్టార్ ని చూసి ఆశ్చర్యపోయే వాళ్లకు కొదవే లేదు. ఎంత నష్టం వచ్చినా సరే సామజిక స్పృహ కలిగించే చిత్రాలు తీయడం మాత్రం ఆయన ఆపరు. ఇప్పటి తరంలో ఇలాంటి నటులు అరుదు కాదు అసలు లేరు.
గతంలో ఆర్టిస్టుగా ఆర్ నారాయణమూర్తికి తమ సినిమాల్లో నటించమని బోలెడు ఆఫర్లు వచ్చినా ఇప్పటిదాకా ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ లో పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ బ్లాంక్ చెక్ ఇస్తే నో అనడం అప్పట్లో ఒక సెన్సేషన్. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా టెంప్ట్ కాకుండా దానికి కట్టుబడుతూ వచ్చారు. అయితే ఇప్పుడా నియమాన్ని పక్కనపెట్టి ఒక ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పినట్టుగా లేటెస్ట్ అప్డేట్.
ఎనిమిదేళ్ల క్రితం 2018లో హుషారు వచ్చింది. సింపుల్ స్టోరీ, యూత్ ఫుల్ ఎలిమెంట్స్, చక్కని పాటలతో దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తీసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. డబ్బులు కూడా వచ్చాయి. ఉండిపోరాదే పాట యువతలో మారుమ్రోగిపోయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా హుషారు 2 తెరకెక్కుతోంది. ఇందులో ఒక ముఖ్యమైన నక్సలైట్ పాత్రకు నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తన భావజాలానికి దగ్గరగా ఉండే రోల్ కావడంతో ఒప్పుకున్నారని వినికిడి.
ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ విశ్వసనీయ వర్గాలు దాదాపు కన్ఫర్మ్ అంటున్నాయి. అదే జరిగితే హుషారు 2 టీమ్ ఒక ఘనత సాధించినట్టే. పీపుల్స్ స్టార్ ఒప్పుకునే స్థాయిలో రాసుకున్నారంటే కంటెంట్ ఏదో బలంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతం హుషారు 2 చిత్రీకరణకు సంబంధించి డీటెయిల్స్ బయటికి ఇవ్వకుండా టీమ్ సైలెంట్ గా పని చేసుకుంటోంది. అయినా యూత్ స్టోరీలో నక్సలైట్ ఏం చేస్తారో, అంతగా నారాయమూర్తిగారికి నచ్చేంత కంటెంట్ ఏముందో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on March 9, 2026 5:55 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…