ఉప్పెన సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి. ఆమె నటించిన రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయాన్నే సాధించింది. కానీ ఆ తర్వాత ఆమెకు అస్సలు కలిసి రాలేదు. వరుస పరాజయాలు వెంటాడాయి. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ.. ఇలా ఆమె చివరి చిత్రాలన్నీ నిరాశ పరిచాయి.దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు.
విరామం తర్వాత ఇటీవలే కృతి నటించిన మనమే సినిమా రిలీజైంది. దాని మీద ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఇది కూడా తనను నిరాశకే గురి చేసింది. కృతి చేసిన గత చిత్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఫ్లాప్గానే నిలిచింది.
ఐతే తెలుగులో ఇలా వరుసబెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నా తమిళంలో మాత్రం కృతికి అవకాశాలు ఆగట్లేదు. ఆల్రెడీ జయం రవి సరసన జెనీ అనే ఫాంటసీ మూవీలో కథానాయికగా నటిస్తోంది కృతి. దీంతో పాటు లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఈ మధ్యే కార్తి కొత్త చిత్రానికి కూడా కృతినే కథానాయికగా ఎంచుకున్నారు. చేతిలో ఇన్ని సినిమాలు పెట్టుకుని.. తమిళంలో మరో కొత్త చిత్రం ఒప్పుకుంది కృతి. ఈసారి ఆమె మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన నటించబోతోంది. సెల్వమణి సెల్వరాజ్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.
విశేషం ఏంటంటే.. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి నిర్మాణ భాగస్వామి అట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రానుంది. రానా ప్రస్తుతం 35 అనే చిన్న చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…