భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు శంకర్. ఇప్పుడందరూ పెద్ద పెద్ద బడ్జెట్లో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ.. 90వ దశకంలోనే సంచలన కథాంశాలతో మెగా బడ్జెట్ మూవీస్ చేసిన దర్శకుడాయన. తొలి చిత్రం ‘జెంటిల్మన్’ మొదలుకుని.. శంకర్ తీసిన ఎన్నో చిత్రాలు సంచలనం రేపాయి.
2010లో వచ్చిన ‘రోబో’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సమయానికి ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి కథ, ఆ తరహా విజువల్స్ ఊహకు కూడా అందనివి. త్వరలోనే ‘ఇండియన్-2’ లాంటి భారీ చిత్రంతో పలకరించబోతున్న శంకర్.. భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
తాను మూడు భారీ బడ్జెట్ సినిమాలు తీయబోతున్నట్లు శంకర్ వెల్లడించాడు. ఆ మూడు కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుని చేయబోయే విజువల్ వండర్సే అని శంకర్ తెలిపాడు. గేమ్ చేంజర్, ఇండియన్-2 కూడా విడుదల అయ్యాక తాను ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను మొదలుపెట్టే అవకాశాలున్నట్లు శంకర్ తెలిపాడు. ఆ తర్వాత జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథ చేస్తానన్నాడు. ఇది ఏ తరహా సినిమా అని చెప్పడానికి ‘జేమ్స్ బాండ్’ అనే పదం వాడానని.. ఐతే ఇది ఆ స్టయిల్లో నడిచే యాక్షన్ కథ అని తెలిపాడు.
ఇది కాక హాలీవుడ్లో వచ్చిన 2012 తరహాలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా చేయాలనుకుంటున్నట్లు శంకర్ వెల్లడించాడు. ఏదో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలి అని ముందే అనుకుని చేస్తున్న సినిమాలు ఇవి కాదని.. కథ డిమాండ్ చేయడంతోనే ఎక్కువ బడ్జెట్ అవసరమని శంకర్ తెలిపాడు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సినిమాలు తెరకెక్కుతాయని.. అన్నింట్లోనూ విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఉంటుందని శంకర్ చెప్పాడు.
This post was last modified on July 3, 2024 3:43 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…