ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న భారతీయుడు 2కి భారీ స్థాయిలో ఉండాల్సిన హైప్ కనిపించకపోయినా రిలీజ్ నాటికి థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతారని బయ్యర్లు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతున్న కమల్ హాసన్ ఇప్పుడీ సీక్వెల్ కంటే మూడో భాగాన్ని ఎక్కువగా ఎలివేట్ చేయడం అభిమానులకు టెన్షన్ కలిగిస్తోంది. ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ తాను సెకండ్ పార్ట్ కి అభిమానిని కానని, మూడో భాగానికి ఫ్యానని చెప్పడం హాజరైన వాళ్ళను షాక్ కలిగించింది. అంటే అసలైన కథ అందులో ఉందనే క్లూస్ ఇచ్చినట్టు భావిస్తున్నారు.
బజ్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్మెంట్లు అంచనాలు తగ్గిస్తాయి. భారతీయుడు 2లో సిద్దార్థ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని, కాజల్ అగర్వాల్ ని వాడుకోకుండా 3 కోసం దాచారని, చంద్రూ తాతయ్య అలియాస్ సేనాపతి తండ్రి కూడా దాంట్లోనే వస్తాడనే వార్తల నేపథ్యంలో ఇప్పుడీ రెండో ఇండియన్ లో ఏముందనే అనుమానం కలగడం సహజం. తమిళం సంగతి ఏమో కానీ తెలుగులో మాత్రం కల్కి 2989 ఏడి ఫీవర్ రెండో వారంలోనూ కొనసాగుతోంది. జూలై 12కి తగ్గుతుందా అంటే ఏమో చెప్పలేం. ఆ రోజు నుంచే సాధారణ రేట్లకు టికెట్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆక్యుపెన్సీలు పెరగొచ్చు.
సరే ఏదైతేనేం భారతీయుడు 2 ఫలితం ఒకవేళ ఏ మాత్రం అటుఇటు అయినా ఆదుకోవడానికి మూడో భాగం ఉంటుందనే కోణంలో డిస్ట్రిబ్యూటర్లు నిశ్చింతగా ఉండొచ్చు. అయితే దర్శకుడు శంకర్ మాత్రం కమల్ విశ్వరూపాన్ని ఇప్పుడీ ఇండియన్ 2లో చూస్తారని హామీ ఇస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన రకరకాల గెటప్పులు, ఫైట్లు అన్నీ ఇందులోనే ఉంటాయానే డౌట్ క్రమంగా మొదలవుతోంది. రిజల్ట్ ని బట్టి థర్డ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. షూటింగ్ అయితే సమాంతరంగా జరిగిపోయింది. అనిరుద్ రవిచందర్ నేపధ్య సంగీతం మీద ప్రత్యేక అంచనాలున్నాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…