Movie News

పంజా దర్శకుడికి నయనతార సడలింపు

అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా అయినా సరే ప్రమోషన్లకు రాదనే సంగతి కొత్తది కాదు. సంతకం పెట్టే టైంలోనే ఈ విషయాన్ని ముందే స్పష్టంగా చెప్పి మరీ షూటింగ్ కు వస్తుంది. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో నటించినా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరు కాలేదు. ట్విట్టర్ లో ఒక థాంక్స్ నోట్ తో సరిపెట్టింది. అంతకు ముందు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ ఎవరితో నటించినా ఇదే వరస. వేడుకలకు సరే కనీసం మీడియా ఇంటర్వ్యూలిమ్మన్నా మొహమాటం లేకుండా నో అనేస్తుంది.

కానీ పంజా దర్శకుడికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. విష్ణువర్ధన్ ఇటీవలే నేసిప్పయ అనే సినిమా తీశారు. అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు క్యాన్సిలయ్యాక సమయం వృధా కాకుండా ఇలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి ఆశించినంత బజ్ లేకపోవడంతో ప్రమోషన్ల కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. నయన్ కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్లలో విష్ణువర్ధన్ తీసిన అజిత్ బిల్లాది ప్రత్యేక స్థానం. ఇది వచ్చాకే ఆమెకు డిమాండ్ పెరిగి వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. చంద్రముఖి కన్నా ఎక్కువ పేరు బిల్లాతోనే వచ్చింది.

ఆ అభిమానమే నయనతారకు తన పట్టుని సడలించుకునేలా చేసింది. ఇది బాగానే ఉంది కానీ మరి కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి తీసుకున్న దర్శక నిర్మాతల కోసం కూడా ఇలా ఈవెంట్లకు రావొచ్చు కదా అంటే మాత్రం సమాధానం ఉండదు. ఇది ఎలాగూ ఉత్పన్నం అవుతుందని ముందే గుర్తించిన నయన్ స్టేజి మీద మాట్లాడుతూ తనకు సహజంగా సినిమా వేడుకలకు హాజరు కావడం ఇష్టం ఉండదని, కానీ విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్ల ఒప్పుకున్నానని చెప్పింది. ప్రస్తుతం అర డజను సినిమాలతో నయనతార మాములు బిజీగా లేదు.

This post was last modified on June 29, 2024 6:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

4 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

5 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

6 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago