అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతార ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా అయినా సరే ప్రమోషన్లకు రాదనే సంగతి కొత్తది కాదు. సంతకం పెట్టే టైంలోనే ఈ విషయాన్ని ముందే స్పష్టంగా చెప్పి మరీ షూటింగ్ కు వస్తుంది. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో నటించినా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరు కాలేదు. ట్విట్టర్ లో ఒక థాంక్స్ నోట్ తో సరిపెట్టింది. అంతకు ముందు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ ఎవరితో నటించినా ఇదే వరస. వేడుకలకు సరే కనీసం మీడియా ఇంటర్వ్యూలిమ్మన్నా మొహమాటం లేకుండా నో అనేస్తుంది.
కానీ పంజా దర్శకుడికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. విష్ణువర్ధన్ ఇటీవలే నేసిప్పయ అనే సినిమా తీశారు. అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు క్యాన్సిలయ్యాక సమయం వృధా కాకుండా ఇలా ప్లాన్ చేసుకున్నారు. దీనికి ఆశించినంత బజ్ లేకపోవడంతో ప్రమోషన్ల కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. నయన్ కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్లలో విష్ణువర్ధన్ తీసిన అజిత్ బిల్లాది ప్రత్యేక స్థానం. ఇది వచ్చాకే ఆమెకు డిమాండ్ పెరిగి వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. చంద్రముఖి కన్నా ఎక్కువ పేరు బిల్లాతోనే వచ్చింది.
ఆ అభిమానమే నయనతారకు తన పట్టుని సడలించుకునేలా చేసింది. ఇది బాగానే ఉంది కానీ మరి కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి తీసుకున్న దర్శక నిర్మాతల కోసం కూడా ఇలా ఈవెంట్లకు రావొచ్చు కదా అంటే మాత్రం సమాధానం ఉండదు. ఇది ఎలాగూ ఉత్పన్నం అవుతుందని ముందే గుర్తించిన నయన్ స్టేజి మీద మాట్లాడుతూ తనకు సహజంగా సినిమా వేడుకలకు హాజరు కావడం ఇష్టం ఉండదని, కానీ విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్ల ఒప్పుకున్నానని చెప్పింది. ప్రస్తుతం అర డజను సినిమాలతో నయనతార మాములు బిజీగా లేదు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…