కల్కి 2898 ఏడి పుణ్యమాని సినిమాని బాగా ఇష్టపడిన కుర్రకారు మహాభారత పాత్రల గురించి గూగుల్ చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా కురుక్షేత్రం గురించి ఏదో కొంత అవగాహన తప్ప ఆ పురాణం గురించి లోతుగా తెలిసిన ఈ జనరేషన్ యూత్ తక్కువ. అందుకే అశ్వద్ధామతో మొదలుపెట్టి కర్ణుడి దాకా ఎవరెవరు ఎవరికి ఏమవుతారనే దాని మీద స్వంతంగా విశ్లేషణలు చేసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కృష్ణుడి పాత్ర గురించి జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. దాన్ని పోషించిన నటుడి మొహం చూపించకపోయినా సరే రకరకాల కోణాల్లో పరిశోధన మొదలుపెట్టారు.
కొందరు కల్కి 2లో మహేష్ బాబు కృష్ణుడు అయితే బాగుతుందంటారు. మరికొందరు నానితో చేయిస్తే అదిరిపోతుందని వివరిస్తారు. ఇంకొందరు ఎవరో ఎందుకు ప్రభాస్ కే ఆ గెటప్ బ్రహ్మాండంగా నప్పుతుందని అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ కృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాక ఏమయ్యాడు, ఆయనకు మరణం ఎలా సంభవించింది, అశ్వద్ధామ కుంజరః కుట్ర వెనుక నేపథ్యం ఏంటని వెతుకులాట చేస్తున్నారు. ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం వచ్చిన చందమామ పుస్తకం కథల నుంచి గీత ట్రస్ట్ మహాభారతం దాకా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పుస్తకాలు తిరగేస్తున్నారు.
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మహాభారతంలో క్యారెక్టర్ల మీద గతంలో పలువురు నటీనటులు మాట్లాడిన వీడియోలను వెతికి మరీ ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. చూస్తుంటే నాగ్ అశ్విన్ కల్కి 2కి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చేలా ఉంది. కమల్ హాసన్ భారతీయుడు 2 ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే స్క్రిప్ట్ సిద్ధంగానే ఉన్నట్టుంది. కాకపోతే ఎప్పుడు మొదలు పెడతారనేది వేచి చూడాలి. కొంత భాగం అయ్యిందట కానీ షూట్ చేయాల్సింది చాలానే ఉందని యూనిట్ టాక్. ఏదైతేనేం కల్కి వల్ల పురాణాలు, ఇతిహాసాల మీద చర్చ జరుగుతోంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…