కల్కి 2898 ఏడి పుణ్యమాని సినిమాని బాగా ఇష్టపడిన కుర్రకారు మహాభారత పాత్రల గురించి గూగుల్ చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా కురుక్షేత్రం గురించి ఏదో కొంత అవగాహన తప్ప ఆ పురాణం గురించి లోతుగా తెలిసిన ఈ జనరేషన్ యూత్ తక్కువ. అందుకే అశ్వద్ధామతో మొదలుపెట్టి కర్ణుడి దాకా ఎవరెవరు ఎవరికి ఏమవుతారనే దాని మీద స్వంతంగా విశ్లేషణలు చేసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కృష్ణుడి పాత్ర గురించి జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. దాన్ని పోషించిన నటుడి మొహం చూపించకపోయినా సరే రకరకాల కోణాల్లో పరిశోధన మొదలుపెట్టారు.
కొందరు కల్కి 2లో మహేష్ బాబు కృష్ణుడు అయితే బాగుతుందంటారు. మరికొందరు నానితో చేయిస్తే అదిరిపోతుందని వివరిస్తారు. ఇంకొందరు ఎవరో ఎందుకు ప్రభాస్ కే ఆ గెటప్ బ్రహ్మాండంగా నప్పుతుందని అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ కృష్ణ పరమాత్ముడు అవతారం చాలించాక ఏమయ్యాడు, ఆయనకు మరణం ఎలా సంభవించింది, అశ్వద్ధామ కుంజరః కుట్ర వెనుక నేపథ్యం ఏంటని వెతుకులాట చేస్తున్నారు. ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం వచ్చిన చందమామ పుస్తకం కథల నుంచి గీత ట్రస్ట్ మహాభారతం దాకా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పుస్తకాలు తిరగేస్తున్నారు.
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మహాభారతంలో క్యారెక్టర్ల మీద గతంలో పలువురు నటీనటులు మాట్లాడిన వీడియోలను వెతికి మరీ ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. చూస్తుంటే నాగ్ అశ్విన్ కల్కి 2కి సంబంధించి చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చేలా ఉంది. కమల్ హాసన్ భారతీయుడు 2 ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే స్క్రిప్ట్ సిద్ధంగానే ఉన్నట్టుంది. కాకపోతే ఎప్పుడు మొదలు పెడతారనేది వేచి చూడాలి. కొంత భాగం అయ్యిందట కానీ షూట్ చేయాల్సింది చాలానే ఉందని యూనిట్ టాక్. ఏదైతేనేం కల్కి వల్ల పురాణాలు, ఇతిహాసాల మీద చర్చ జరుగుతోంది.
This post was last modified on June 29, 2024 10:09 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…